ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షం
వనపర్తి జిల్లాలో 98 శాతం అధిక వర్షపాతం నమోదు
వనపర్తి రూరల్, జూలై 21 : జిల్లాలో వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాకాలంలో సాధారణ వర్షపాతం కంటే అధికంగా నమోదైంది. జూన్ 1 నుంచి ఈనెల 21 వరకు సాధారణ వర్షపా తం 164.4 మి.మీ. కాగా 325.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. బుధవారమూ వర్షం కురిసింది. అత్యధికంగా పాన్గల్లో 22.0 మి.మీ. పడగా.. గోపాల్పేటలో 8.8, పెద్దమందడిలో 6.5, పెబ్బేర్లో 4.3, ఖిల్లాఘణపురంలో 2.0, రేవల్లిలో 8.6, అమరచింతలో 3.0, వనపర్తిలో 8.3, కొత్తకోటలో 2.0, ఆత్మకూర్లో 5.0, మదనాపురంలో 1.0, శ్రీరంగాపురంలో 2.5, వీపనగండ్లలో 1.8, చిన్నంబావిలో 0.7 మి.మీ. వర్షం కురిసింది. చెరువులు, కుంట లు జలకళ సంతరించుకున్నాయి.
మోస్తరు వర్షం..
గద్వాల, జూలై 21 : జోగుళాంబ గద్వాల జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వ రకు మోస్తరు వర్షం కురిసింది. గద్వాల మండలంలో 4.6 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, కేటీదొడ్డిలో 4.8, గట్టులో 9.7, మల్దకల్లో 3.5, ధరూర్లో 2.7, అలంపూర్లో 10.0, ఇటిక్యాలలో 3.2, అయిజలో 12.9, మానవపాడులో 9.5, వడ్డేపల్లిలో 17.0, రాజోళిలో 13.5, ఉండవెల్లి మండలంలో 11.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యా ప్తంగా 102.6 మి.మీ. వర్షం కురవగా.. సరాసరి వర్షపా తం 8.6 మిల్లీమీటర్లు నమోదైంది.
ముంచెత్తిన ముసురు..
మహబూబ్నగర్, జూలై 21 : పాలమూరు జిల్లాను ముసురు ముంచెత్తింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం వరకు మోస్తరు వాన పడింది. జిల్లా వ్యాప్తంగా 1 సెంటీమీటర్ వర్షపాతం నమదైనట్లు అధికారులు తెలిపారు. ఈ వర్షంతో రైతన్న హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
నాగర్కర్నూల్ జిల్లాలో..
నాగర్కర్నూల్, జూలై 21 : జిల్లాలో మోస్తరు వర్షం కురుస్తోంది. పలు మండలాల్లో రెండ్రోజులుగా రోజులు గా మురుసు ముంచెత్తుతున్నది. తెలకపల్లి, పదర మిన హా అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా లింగాలలో 16.4 మి.మీ., అత్యల్పంగా నాగర్కర్నూల్లో 0.8 మి.మీ. నమోదైంది. తిమ్మాజిపేటలో 4.2, బిజినేపల్లిలో 1.0, తాడూరులో 1.0, పెద్దకొత్తపల్లిలో 11.0, కోడేరులో 9.0, కొల్లాపూర్లో 8.2, పెంట్లవెల్లిలో 4.0, చారకొండలో 4.0, వెల్దండలో 2.4, వం గూరులో 1.6, కల్వకుర్తిలో 5.4, ఊర్కొండలో 5.8, ఉప్పునుంతలలో 3.2, అచ్చంపేటలో 1.2, అమ్రాబాద్లో 2.4, బల్మూర్లో 3.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నారాయణపేటలో 42.7 మి.మీ..
నారాయణపేట టౌన్, జూలై 21 : జిల్లాలో మంగళవారం రాత్రి 42.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. కోస్గి మండలంలో అత్యధికంగా 14, మాగనూర్ మండలం లో అత్యల్పంగా 1.4 మి.మీ. వర్షం కురిసింది. దామరగిద్దలో 3.2, నారాయణపేటలో 2.2, ఊట్కూర్లో 2.0, కృష్ణలో 5.5, మక్తల్లో 2.0, నర్వలో 1.8, మరికల్లో 1.8, ధన్వాడలో 4.6, మద్దూర్ మండలంలో 4.2 మి. మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి ముసురు వాన కురిసింది.