రామాయంపేట, జూన్ 27: వార్డుల్లో ఉన్న సమస్యలను విడుతల వారీగా పరిష్కరిస్తానని రామయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం రామాయంపేట మున్సిపల్లోని 7, 4వ వార్డుల్లో సమావేశాలు నిర్వహించి ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. వార్డులోని పనులను త్వరితగతిన పూర్తి చేస్తానని, రామాయంపేటను ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి చేశామన్నారు. వార్డుల్లో సమస్యలు లేకుండా పూర్తి చేయగలిగామని చైర్మన్, కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సుందర్సింగ్, జయరాజు, మల్యాల కవిత కిషన్, సిబ్బంది కాలేరు ప్రసాద్, నవాత్ ప్రసాద్, బల్ల శ్రీనివాస్, శంకర్, టీఆర్ఎస్ నాయకులు కృష్ణాగౌడ్, రాజు ఉన్నారు.