కేసీఆర్ పేరిట సుదర్శన నారసింహహోమం నిర్వహించిన అర్చకులు
క్షేత్రపాలకుడికి ఆకుపూజ
శాస్ర్తోక్తంగా ఎదుర్కోలు
కర్ఫ్యూ నేపథ్యంలో ఆలయ వేళల్లో మార్పులు
యాదాద్రి, ఏప్రిల్, 20: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం అర్చకులు ప్రత్యేక పూజలు ని ర్వహించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆలయ ప్రధానార్చ కుడు నల్లందీగళ్ లక్ష్మీనారసింహచార్యులు ఆధ్వర్యంలో స్వామివారి బాలాలయంలో ప్రత్యేకంగా సుదర్శన నారసిం హ హోమం అత్యంత వైభవంగా చేపట్టారు. సుప్రభాతం మొదలుకుని పవళింపు సేవ వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గోత్రనామాల పేరిట పూజలు చేపట్టారు. రాష్ట్రంలో పెరుగు తున్న కరోనా వైరస్ నశించి, ప్రజలు ఆరోగ్యంతో జీవించా లని అర్చక బృందం కరోనా అనే మసూచి మంత్రాలతో ప్రత్యేక హోమం చేపట్టారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. తులసీద ళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనం తరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మం డపంలో సుదర్శన నారసింహహోమం అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణం జరిపించారు. రాత్రి బాలాల యంలోని ప్రతిష్ఠ్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చ న జరిగాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య తగ్గింది. దీంతో బాలాలయం, క్యూలైన్లు ఖాళీగా దర్శనమిచ్చాయి.
వైభవంగా క్షేత్రపాలకుడికి ఆకుపూజ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో క్షేత్రపాల కుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టా రు. ఈ క్షేత్రానికి పాలకుడిగా చెంత గల గుడిలో హనుమం తుడిని సిందూరంతో అలంకరించి అభిషేకించారు. తమల పాకులతో అర్చన చేపట్టారు. వేదమంత్రాల మధ్య జరిగిన పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నా రు. తమలపాకులతో అర్చన చేశారు. లలితాపారాయణం చేశారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
వైభవంగా ఎదుర్కోలు..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధాలయమైన ప ర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వర బాలాలయంలో సీతారా మచంద్రస్వామి ఎదుర్కోళ్ల మహోత్సవం అత్యంత వైభవం గా సాగింది. రామలింగేశ్వరుడికి పూజల అనంతరం స్వా మి, అమ్మవార్ల ఎదుర్కోలు వేడుకలను సంప్రదాయరీతిలో పురోహితులు నిర్వహించారు.
నేడు సీతారామచంద్రస్వామి కల్యాణం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో బుధవా రం శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా సీతారాముల క ల్యాణం నిర్వహించనున్నారు. కొండపై పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి బాలాలయంలో కల్యాణ వేడుకలను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేపథ్యం లో కొవిడ్ నిబంధనల మేరకు ఆంతరింగికంగానే అత్యం త వైభవంగా చేపట్టనున్నామని తెలిపారు.
ఖజానాకు రూ. 2,84,514 ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఖజానాకు రూ. 2, 84,514 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తె లిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 22,812, రూ. 100 దర్శనాలతో రూ. 5,800, ప్రచారశాఖ ద్వారా రూ. 300, క్యారీబ్యాగులతో రూ.1,375, వ్రతాలతో రూ. 3,500, క ల్యాణకట్టతో రూ. 9,200, ప్రసాద విక్రయాలతో రూ. 1, 33,750, వాహనపూజలతో రూ. 5,000, టోల్గేట్ ద్వా రా రూ. 1,000, అన్నదాన విరాళంతో రూ. 112, సువర్ణ పుష్పార్చనతో రూ. 21,440, యాదరుషి నిలయంతో రూ. 17,550, పుష్కరిణితో రూ. 200, పాతగుట్టతో రూ. 7,135, టెంకాయల విక్రయాలతో రూ. 11,400, ఇతర విభాగాలతో రూ. 43,940తో మొత్తంగా రూ. 2,84,514 ఆదాయం లభించిందని ఆలయ అధికారులు తెలిపారు.
కర్ఫ్యూ నేపథ్యంలో ఆలయ వేళల్లో మార్పులు..
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యం లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాత్రి కర్ఫ్యూ దృష్ట్యా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయంతో పాటు అనుబంధ పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆల యం సమయవేళ్లలో మార్పులు చేస్తున్నట్లు ఆలయ ఈవో ఎన్. గీత తెలిపారు. ఉదయం 5.30 గంటలకు ఆలయాన్ని తెరిచి రాత్రి 8.30 గంటలకు ఆలయాన్ని మూసివేయను న్నట్లు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. స్వామిని దర్శించుకు నేందుకు వచ్చే భక్తుల గమనించగలరని విజ్ఞప్తి చేశారు.