సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్
జడ్చర్లటౌన్, ఏప్రిల్ 11 : సామాజిక సంస్కర్త మహాత్మ జ్యోతీరావు పూలేను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ అన్నారు. జ్యోతీరావు పూలే జయంతి సందర్భంగా ఆదివారం జడ్చర్లలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఎంపీడీవో కార్యాలయంలో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, ఎంపీడీవో ప్రవీణ్కుమార్ తదితరులు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మార్సీ భవనం ఆవరణలో పూలే విగ్రహానికి ప్రజా, కులసంఘా ల నాయకులు పూలమాల వేశారు. మాచా రం గ్రామంలో సర్పంచ్ రవీందర్రెడ్డి, బూ ర్గుపల్లిలో బీసీసేన రాష్ట్ర కార్యదర్శి కృష్ణయా దవ్ ఆధ్వర్యంలో పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమా ల్లో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్చందర్, సింగిల్విండో చైర్మన్ సుదర్శన్గౌడ్, మాజీ సర్పంచ్ రేణుక, నాయకులు రవిశంకర్, కొంగళి జంగయ్య, పరమట య్య, పెద్ది బాలకృష్ణ, శ్రీకాంత్, నడిమింటి శ్రీనివాస్, లత, జీవన్గుండప్ప, రవినాయక్, బాలవర్ధన్గౌడ్, అయ్యన్న, సతీశ్, రాధాకృష్ణ, కృష్ణ య్య పాల్గొన్నారు.
ఆశయసాధనకు కృషి చేయాలి
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన మహాత్మా జ్యోతీరావు పూలే ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ అనంతయ్య అన్నారు. మండల పరిషత్ కా ర్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమా ల వేసి నివాళులర్పించారు. అలాగే కొల్లూరు గ్రామంలో పూలే జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీలత, ఎంపీవో భద్రునాయక్, సర్పంచ్ గోపాల్గౌడ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఏపీవో జ్యోతి, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మి, నాయకులు ప్రతాప్, కొల్లూరు సర్పంచ్ సౌజన్య, ఎంపీటీసీ తుల్సీరాంనాయక్, ఉపసర్పంచ్ నర్సింహాచారి, చందర్నాయక్, రఘు, ఖాజా, రత్నబాబునాయక్, గోపాల్గౌడ్, సత్యనారాయణగౌడ్, పంచాయతీ కార్యదర్శి గంగన్న తది తరులు పాల్గొన్నారు.