మక్తల్ అర్బన్, నవంబర్ 6: మక్తల్ మున్సి పాలిటిలోని ఎల్లమ్మకుంట గార్లపల్లి రోడ్డులో నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు 1వ వార్డు కౌన్సిలర్ శ్వేతా విష్ణేవర్ధన్రెడ్డి, 3వ వార్డు కౌన్సిలర్ జగ్గలి రాము లు, 5వ వార్డు కౌన్స్లర్ మొగిలప్ప, 7వ వార్డు కౌన్సిలర్ జ్యోతీ రాజేశ్గౌడ్, 10వ వార్డు బీఆర్ఎస్ యువ నాయకుడు సాగర్, 12వ వార్డు కౌన్సిలర్ అన్వర్ హుస్సేన్, వనయకుంట సర్పంచ్ నర్సింహులు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు, అభి మానులు తరలి వెళ్లారు. కార్యక్రమంలో మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు రాధిక, కర్రెం కృష్ణ, మారుతి, అంజప్ప, మజర్, వసీం, సాదిక్, శివ తదితరులు తరలివెళ్లారు.
అమరచింత, నవంబర్ 6: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మక్తల్ పట్టణంలో నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలివెళ్లారు.
కృష్ణ, నవంబర్ 6 : మక్తల్లో సోమవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు మండలం నుంచి 200 వాహనాల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ 4,000 మంది కార్యకర్తల తో తరలివెళ్లారు. కార్యక్రమంలో ఎంపీపీ పూర్ణిమా వెంకట్రెడ్డి పాటిల్, జెడ్పీటీసీ అంజనమ్మపాటిల్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయ్పాటిల్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మోనేశ్, సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శివప్ప, మాజీ వైస్ ఎంపీపీ ఆంజనేయులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
నర్వ, నవంబర్ 6: మండల కేంద్రంతో పాటు లంకాల, రాంపూర్, కుమార్లింగంపల్లి, ఉందెకోడ్, జంగంరెడ్డిపల్లి, పాతర్చేడ్, రాయికోడ్, రాజుపల్లి, కల్వాల, సీపూర్, కొత్తపల్లి, లక్కర్దొడ్డి, ఎల్లంపల్లి, పెద్దకడ్మూర్, బెక్కర్పల్లి, నాగిరెడ్డిపల్లి, యాంకి, జక్కన్నపల్లి గ్రామాల నుంచి సోమవారం మక్తల్లో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.
రాయికోడ్ గ్రామం నుంచి ఎంపీపీ జయరాములు, విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, పెద్దకడ్మూర్ నుంచి జెడ్పీటీసీ జ్యోతి కిరణ్ ప్రకాశ్రెడ్డి, విండో ఉపాధ్యక్షుడు, నర్వ నుంచి వైస్ ఎంపీపీ వీణావతి, కల్వాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి ఆయా గ్రామాల నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు పార్టీ నాయకులు, పార్టీ గ్రామ అధ్యక్షుల ఆధ్వర్యంలో డోలు, తప్పెట్లతో ర్యాలీగా సభకు తరలి వెళ్లారు. కల్వాల గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు.