నాగర్కర్నూల్, ఏప్రిల్ 2 : ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రైతాంగానికి ఇచ్చిన హామీలను విస్మరిస్తూ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారన్నారు. మంగళవారం కలెక్టర్ ఉదయ్కుమార్ను కలిసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించిన అనంతరం గువ్వల మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రైతులను నిరుత్సాహానికి గురిచేస్తున్నదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వందరోజులు గడవకముందే 200మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడడానికి కారణమైందని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ధాన్యాన్ని అమ్మకండి.. దాచిపెట్టుకోండి.. రూ.500 బోనస్ ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రుణమాఫీ అయిన రైతులందరూ వెంటనే రూ.2లక్షల రుణం తెచ్చుకోండి.. డిసెంబర్ 9న రుణమాఫీపై సంతకం చేస్తానని చెప్పి ఇప్పటికీ ఉలుకూపలుకూ లేదన్నారు. పింఛన్ల విషయంలోనూ ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.4వేలు పింఛన్ ఇస్తామని నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చి ప్రస్తుతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. ప్రధానంగా రైతులపై కక్షగట్టినట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని, రైతుబంధుపై ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాతున్నారన్నారు.
ఈవిషయమై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తనకే క్లారిటీ లేదని, అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల ముం దు అన్ని చర్చించే మ్యానిఫెస్టో విడుదల చేసి, ఇ ప్పుడు కొత్తగా చర్చిస్తామని చెప్పడం ఏంటని ప్ర శ్నించారు. ఇదంతా రైతులను మభ్యపెట్టేందుకు చేస్తున్న కుట్రేనని వివరించారు. ఈ సర్కారు రైతులను ఇబ్బంది పెట్టడం చూసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలిస్తున్నారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా గెలవాలి? ఇతర పార్టీల వారిని ఏవిధంగా తమ పార్టీలోకి లాగాలి? అని ఆలోచిస్తుందే తప్పా రైతుల గురించి మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. భవిష్యత్తులో పట్టించుకుంటారనే నమ్మకం కూడా లేదన్నారు. ప్రతిపక్ష పార్టీగా తమ బాధ్యతగా రైతుల పక్షాన గొంతుక వినిపిస్తామని, ఉద్యమాలను ఉధృతం చేస్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు చేస్తామన్నారు. క్వింటా ధా న్యానికి రూ.500ల బోనస్, రైతు భరోసా, పంటనష్టం కింద ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలని డి మాండ్ చేశారు. నోటికి వచ్చినట్లు మాట్లాడడం మా నేసి సమిష్టి నిర్ణయాలను ప్రకటించాలి, అమలు చేయాలి తప్పా తప్పించుకునే ధోరణి మంచి కాదని సీఎం రేవంత్రెడ్డి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పంట నష్టాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి బీఆర్ఎస్ శ్రేణులు, రైతు అభిమానులందరూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు భాస్కర్గౌడ్, మాధవరెడ్డి, నర్సింహ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.