మహబూబ్నగర్ అర్బన్, జూలై 13 : అభివృద్ధే తమ సర్కారు ధ్యేయమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వివిధ వార్డుల కు చెందిన 200 మంది కాంగ్రెస్ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు మైమాన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గురువా రం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతు న్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీ ల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. గతం లో మహబూబ్నగర్ పట్టణంలో తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి ఉండేదని.. నేడు మిషన్ భగీరథ ద్వారా ప్ర తి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామన్నారు.
కులమత బేధాలు లేకుండా పాలన కొనసాగిస్తున్నామన్నారు. వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నామన్నారు. స్థానికంగా ఉద్యోగాలు లభించేలా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయన్నారు. అనంతరం మైమాన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమా న్, మాజీ చైర్మన్ రాజేశ్వర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, నాయకులు సుధాకర్, సిరాజ్, ఫరహాన్, జహీదాభాను, రిజ్వానాభాను, నసీం, ముక్తదర్, రహమత్ ఉ న్నీసా, సుల్తానా, రషీద్ తదితరులు పాల్గొన్నారు.