మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జనవరి 7 : మహబూబ్నగర్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో కారు ఫ్యాన్సీ నెంబర్కు క్రేజ్ పెరిగింది. కారుకు లక్కీ నెంబర్ కోసం ఓ కారు యజమాని ఆన్లైన్లో ఎనిమిది మందితో పోటీపడి రూ.2,36,666 (టీఎస్ 06 ఎఫ్ ఎఫ్ 6666) దక్కించుకున్నాడు.
మహబూబ్నగర్కు చెందిన నీలాద్రి చిట్ఫండ్ అధినేత బత్తిని కిష్టారెడ్డి నూతనంగా కొనుగోలు చేసిన ఇన్నోవా కారుకు ఫ్యాన్సీ నెంబర్కు పోటీపడి దక్కించుకున్నాడని మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ సంగెం నరేశ్ తెలిపారు. అనంతరం ఆయనకు నెంబర్ను కేటాయించారు.