గద్వాల అర్బన్ అక్టోబర్ 19 ః తాళం వేసిన ఇంటికి కన్నం వేసి ఇంట్లో గుల్ల చేస్తున్న సంఘటనలు జిల్లా కేంద్రంలో భీభత్సం సృష్టిస్తున్నాయి. గురువారం జిల్లా కేంద్రంలోని సంతోష్ నాగర్ కాలనీలో ఓ ఇంట్లో దొంగలు చొరబడి భారీ మొత్తంలో డబ్బులు,బంగారు నగలు అపహరించిన సంఘటన చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు…గోపాల్ దిన్నె గ్రామానికి చెందిన సునీత తండ్రీ సుధాకర్ రెడ్డితో పాటు గత సంవత్సరం క్రితం జిల్లా కేంద్రంలో సంతోష్ నగర్లో అద్దెకు ఉంటుంది.ఈ నెల 13వ తేదిన శుక్రవారం సునీత వారి బంధువుల ఇంటికి రామాపురంకు పెద్దల పండుగకు వెళ్లింది.ఈ క్రమంలో దొంగలు ఇంటి తాళం చూసి పసిగట్టి ఇదే అదునుగా భావించి బుదవారం అర్థరాత్రి ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న 10 తులాల బంగారు అలాగే పొలం అమ్మిన 14 లక్షల రూ..
నగదును ఎత్తికెళ్లినట్లు వివరించారు.గురువారం ఉదయం వచ్చి ఇంటిని తెరవగా ఇంట్లో ఉన్న వస్తువులు,బీరువాలో ఉన్న వస్తువులు చిందరవందరంగా ఉండడంతో పోలిస్లకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న గద్వాల టౌన్ ఎసై శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకొని దొంగతనంపై ఆరా తీశారు.వెంటనే క్లూస్ టీం అధికారులను,జాగిళలతో దుండగుల కదలికలపై ఆరా తీశారు.ఈ మధ్యనే తమ అర్థిక ఇబ్బందులతో సతమతమవుతు తమకు ఉన్న 2 ఎకరాల పొలం అమ్మి ఇబ్బందులు తీర్చుకొవాలన్నట్లు బాధితురాలు సునిత అవేదన వ్యక్తం చేసింది.సునీత ఫిర్యాదు మేరకు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎసై శ్రీకాంత్ పేర్కొన్నారు.సంఘటన స్థలానికి ఎస్బీ సీఐ రామస్వామి,టౌన్ ఎసై అబ్దుల్ షుకుర్ తదితరులు ఉన్నారు.