గద్వాల, ఫిబ్రవరి 20 : ఫుడ్ పాయిజన్తో 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన గద్వాల మండలంలోని రేకులపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం చోటుచేసుకున్నది. పాఠశాల లో మధ్యాహ్నం అన్నంతోపాటు టమాట కూర వడ్డించారు. భోజనం తిన్న తరువాత వి ద్యార్థులు ఆనందమణి, చరణ్, శివ, రాకేశ్, హరీశ్, వరుణ్, పర్వతకుమార్, క్రాంతి, తేజేశ్వరి, మానస, సునీత, మల్లిక, మల్లికార్జున్కు వాంతులు, తలనొప్పి, కడుపునొప్పి రావడంతో ఉపాధ్యాయులు గద్వాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
వైద్యులు పరీక్షలు నిర్వహించి గంటపాటు అబ్జర్వేషన్లో ఉంచారు. ఆరోగ్యం కుదుటపడడంతో పం పించారు. విద్యార్థులకు ఎటువంటి ప్ర మాదం లేదని వైద్యురాలు సౌమ్య తెలిపారు. విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి సురేశ్ దవాఖానకు చేరుకొని విద్యార్థులను పరామర్శించారు. ఘటనపై వివరాలు సేకరించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.