రాజాపూర్, ఏప్రిల్ 4 : మండలకేంద్రంలోని జాతీయ రహదారిపై ఓ వాహనంలో ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 8,41, 700 నగదును పోలీసులు గురువారం స్వా ధీనం చేసుకున్నారు. రూ.50వేలకు మించి నగదు తరలిస్తే అందుకు సంబంధించిన బిల్లులు పెట్టుకోవాలని ఎస్సై రవి సూచించారు.
గద్వాల అర్బన్/ఉండవెల్లి, ఏప్రిల్ 4 : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దు చెక్పోస్టుల్లో పోలీసులు వాహనాలను విస్తృత్తంగా తనిఖీ చేస్తున్నట్లు ఎస్పీ రితిరాజ్ పేర్కొన్నారు. గురువారం గట్టు పోలీస్స్టేషన్ పరిధిలో ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.2.76 లక్షలు, ఉండవెల్లి మండలం పుల్లూరు చెక్పోస్టు వద్ద రూ.1,97,500 నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. పట్టుబడిన నగదును గ్రీవెన్స్ రిడ్రెసెల్ కమిటీకి అప్పగించినట్లు ఎస్పీ వివరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందునా అధిక మొత్తంలో నగదును తరలించొద్దని సూచించారు. ఒకవేళ రూ.50 వేలకు మించి తీసుకెళ్లాల్సి వస్తే అందుకు సంబంధించిన రసీదులు తప్పనిసరిగా చూపించాలన్నారు.
ఉండవెల్లి మండలం ప్రాగటూరులో అక్రమంగా నిల్వ ఉంచిన 61మద్యం సీసాలను ఏఎస్సై సుబ్బారెడ్డి పట్టుకొన్నారు. అనంతరం మోసన్రాజ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.