రంజాన్ను శనివారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయమే ఈద్గాలు, మసీదుల వద్దకు చేరుకొని సామూహిక ప్రార్థనలు చేశారు. బంధువులను ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ తెలుపుకొన్నారు. మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, వనపర్తిలో మంత్రి నిరంజన్రెడ్డితోపాటు నియోజకవర్గ కేంద్రాల్లో ఆయా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
మహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 22 : మత సామరస్యానికి ప్రతీకగా తెలంగాణ నిలుస్తున్నదని క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని శనివారం మహబూబ్నగర్లోని వానగుట్ట వద్దనున్న వక్ఫ్ రహెమానియా ఈద్గాలో మంత్రి శ్రీనివాస్గౌ డ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి ముస్లింలను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ గడిచిన తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో ప్రతిఒక్క రూ సంతోషంగా, ప్ర శాంత వాతావరణంలో జీవిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. మహబూబ్నగర్ ఎంతో అభివృద్ధి చెందిందని.. అన్ని రంగాల్లో పురోగతి సా ధించామని చెప్పారు. భవిష్యత్లో హైదరాబాద్ తరహా పాలమూరును సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎంపీ మన్నె మాట్లాడుతూ.. బంగారు తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నిరంతరం కృ షి చేస్తున్నారన్నారు.
అనంతరం కౌమి ఏక్తా కమి టి ప్రతినిధి రఫీక్పటేల్ నివాసంలో నిర్వహించిన ఈద్మిలాప్ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమా న్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, గ్రంథాలయసం స్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ వైస్చైర్మన్ గణేశ్, డీసీసీబీ వైస్చైర్మన్ వెంకటయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, ఈద్గాకమిటీ అధ్యక్ష, కార్యదర్శులు తఖీహుస్సేన్, హఫీజ్ ఇద్రీస్, నాయకులు ఒబేదుల్లా కొత్వాల్, అన్వర్పాషా, జాకీర్, సమాద్ఖాన్, కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.