గద్వాల, మార్చి 28 : ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ గద్వాలలో వందశాతం నమోదైంది. అయితే ఎన్నికల వేళ పోలీసులు ఓవరాక్షన్ ప్రదర్శించారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలోని పోలింగ్ స్టేషన్లో ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలతో కలిసొచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం బయటకు వచ్చి దివ్యాంగురాలైన ఎంపీటీసీ ఓటు వేయాల్సి ఉండ గా.. ఆమె కోసం ఎమ్మెల్యే సమావేశ మందిరం బయట నిలబడ్డాడు. అయితే అక్కడికి చేరుకున్న సీఐ ఎమ్మెల్యేను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దివ్యాంగురాలు వస్తుందని, ఆమె ఓటు వేసిన వెంటనే వెళ్లిపోతామని సీఐకి చెప్పినా వినకపోవడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఓటు వేయడానికి వచ్చిన ప్రజాప్రతినిధులపై సైతం సీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెళ్లి పోతామని చెప్పినా ఎందుకలా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా పోలీస్ సిబ్బంది సర్దిచెప్పి పంపించారు. అనంతరం పోలీసులు, పాత్రికేయుల మధ్య మాటలయుద్ధం నెలకొన్నది. ఓటింగ్ జరిగే పరిసరాల్లో పాత్రికేయులు ఉండొద్దని.. అక్కడినుంచి వెళ్లిపోవాలని సూచించారు. తమకు పాస్లు ఉన్నాయని, అక్కడ ఉండే హక్కు తమకు ఉందని పాత్రికేయులు చెప్పినా పో లీసులు పట్టించుకోకపోవడంతో తమకు ఇచ్చిన పా స్లు అవసరం లేదని చెప్పి జిల్లా సమాచార శాఖ అధికారికి అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎన్నికల వేళ పోలీసుల ఓవరాక్షన్తో ఎమ్మెల్యేతోపాటు రిపోర్టర్లు సైతం ఇబ్బందులు పడ్డారు. అయి తే ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత ఓటింగ్ జరిగే ప్రాంతా ల్లో ఇతరులు తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం కొసమెరుపు. అనంతరం అలంపూర్ ఎమ్యెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, తమ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఓటింగ్ సమయంలో మరోసారి కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గపోరు భగ్గుమన్నది. మొదటగా జెడ్పీ చైర్పర్సన్ సరిత, కౌన్సిలర్లతో కలిసొచ్చి ఓటు వేసి వెళ్లిపోయారు. అనంతరం మరో వర్గమైన బండ్ల చంద్రశేఖర్రెడ్డి, కౌన్సిలర్ శంకర్, ఎంపీటీసీలతో కలిసి ప్రత్యేక బస్సులో వచ్చి ఓటు వేసి వెళ్లారు. అలంపూర్కు చెందిన కొంతమంది కాంగ్రెస్ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు వచ్చి ఓటు వేసి వెళ్లారు.