“58 ఏండ్లపాటు రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ నాయకులు పాలమూరును ఆగమాగం చేసిండ్రు.. మనల్ని ఏడిపించారు.. ఉమ్మడి జిల్లాను ముంబయి బస్సులకు ఆలవాలం చేసిండ్రు.. మంచినీళ్లు ఇవ్వలే.. సాగునీరు ఇవ్వలే.. కరెంట్ ఇవ్వలే.. చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, వలసలకు అడ్డాగా మార్చిండ్రు.. హస్తం పార్టీ 58 ఏండ్ల పాలనలో ఇవి మన బతు
కులు.. అటువంటి స్థాయి నుంచి నేడు ప్రగతికి కేరాఫ్గా మారే స్థాయికి ఎదిగింది.. నాడు ఎట్లుండే.. నేడు ఎట్లయింది’.. అంటూ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం మహబూబ్నగర్, కోస్గి, పరిగిలో జరిగిన ప్రశా ఆశీర్వాద సభల్లో ప్రగతి ప్రదాత మాట్లాడుతూ నాటి కాంగ్రెస్ పాలన తీరును ఎండగట్టారు. తెలంగాణ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. ఇతర రాష్ర్టాల నుంచి రివర్స్ వలసలు ప్రారంభమయ్యాయన్నారు. కమిట్మెంట్ ఉన్న వ్యక్తి మంత్రి శ్రీనివాస్గౌడ్ అని, ఆయన పట్టుబట్టి మరీ ఐటీ టవర్, రూ.10 వేల కోట్లతో అమరరాజా ఫ్యాక్టరీని తీసుకొచ్చారని తెలిపారు.
విలువైన ఆయుధం ఓటు.. రాబోయే ఐదేండ్ల భవిష్యత్ను, తలరాతను నిర్ణయించేది.. అందుకే సద్వినియోగం చేసుకోవాలి.. ఎలక్షన్లు రాగానే గాయ్.. గాయ్.. గత్తర గత్తర నేతలు పోటీ పడుతున్నారు. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అవుతున్నారు. రాత్రికి రాత్రికే టికెట్లు తెచ్చుకొని పోటీపడుతున్నారు. అందుకే రాయేదో.. రత్నమేదో గుర్తించాలి.. పార్టీ చరిత్ర తెలుసుకోవాలి.. మంచి వాళ్లకు ఓటేయాలి.. రైతులు, ప్రజల జీవన్మరణ సమస్య, తప్పటడుగు పడితే గోస పడుతాం.. అందుకే సరైనోళ్లను ఎన్నుకోవాలి..
మహబూబ్నగర్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ నేతలు మన బతుకులను ఆగం చేశారంటూ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రగతి ప్రదాత, గులాబీ బాస్ కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఎన్నికలు రాగానే గాయ్..గాయ్.. గత్తర గత్తర అంటూ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని అన్నారు. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. ఈ పార్టీ నుంచి మరో పార్టీకి పోయి రాత్రికి రాత్రికే టికెట్లు తెచ్చుకొని పోటీ చేస్తున్నారు. ఇదేనా పద్ధతి అంటూ నిలదీశారు. ప్రజల వద్ద ఉన్న విలువైన ఆయుధం ఓటు.. అది మామూలు ఓటు కాదు.. అది వచ్చే ఐదేళ్ల మహబూబ్నగర్ భవిష్యత్ను నిర్ణయించేవి.. తెలంగాణ భవిష్యత్తును మీ తలరాతను మారుస్తది.
అలాంటి విలువైన ఓటును చూసి వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు. మంచి వాళ్లకు ఓటేస్తే మీకు మేలు జరుగుతుంది.. లేకుంటే ఇబ్బంది అవుతుందని హెచ్చరించారు ఈ ఎన్నికల్లో మూడు పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, ఏ అభ్యర్థి ఎలాంటివాడు చూడాలని, అభ్యర్థులను వెనుక పార్టీల చరిత్రను సామాజిక దృక్పథాన్ని, పేదలపై అవలంభించే వైఖరిని చూడాలన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం.. 14 ఏళ్లపాటు ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. కానీ 58 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ నాయకులు ఈ జిల్లాను వలసలకు కేరాఫ్గా మార్చి మన బతుకులు ఆగం చేశారని ధ్వజమెత్తారు. శ్రీనివాస్గౌడ్ మున్సిపల్ కమిషనర్గా ఉండి ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమం వైపు నడిచాడని, ఎంతో మంది ఉద్యోగులు, ఉద్యమ బాట పట్టేలా చేశారన్నారు.
అనేకమంది చావులకు కాంగ్రెస్ కారణమైందని, ఇది ఆ పార్టీ చరిత్ర అని అన్నారు. తెలంగాణ సాధించాక పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలిచ్చిన ఆశీర్వాదంతో ఎంతో అభివృద్ధి చేశామని, అది మీ కళ్ల ముందే ఉందన్నారు. 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం.. రైతుబంధు ఇస్తున్నాం.. ధాన్యం కొంటున్నాం.. ప్రభుత్వానికి నష్టం వచ్చిన రైతులకు గింజ వదలకుండా ధాన్యం కొంటున్నాం.. రైతులు అకారణంగా చనిపోతే రైతు బీమా ఇస్తున్నాం.. రైతుల బాధలను తొలగించేందుకు అనేక పథకాలు తీసుకువచ్చినం అని అ న్నారు. శ్రీనివాస్గౌడ్ గెలిస్తే రైతుబంధు రూ. 16,000 చే స్తాం. శ్రీనివాస్గౌడ్ గెలిస్తేనే ఆ పైసలు వస్తాయి.. ప్రతి ఒక్కరికీ ఇచ్చి యుద్ధం ఒకరిని చేయమంటే చేస్తా రా..? అంటూ రైతులను ప్రశ్నించారు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ అంటున్నాడు.. 3 గంటల కరెంట్ రైతులకు సలని.. మూడు గంటల కరెంటు రైతులకు సరిపోతదా? అని ప్రశ్నించారు. శ్రీనివాస్గౌడ్ గెలుస్తనే 24 గంటల కరెంటు ఉంటది.. లేకపోతే కాంగ్రెస్ కాకి వచ్చి ఎత్తుకో పోతది అంటూ హెచ్చరించారు. ధరణి తీసేసి భూ మాత చేస్తామని కాంగ్రెసోళ్లు అంటున్నారు.. భూ మాతనా? భూమేతనా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ పాత రోజులు వస్తా యి.. ఆ నాటి వ్యవస్థను మళ్లా తీసుకురావాలని ప్రయ త్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు ఎక్కడబడితే అక్కడ మాట్లాడుతున్నారు.. ఇది రైతుల జీవన్మరణ సమస్య, జాగ్రత్తగా గమనించి సరైనోడిని ఎన్నుకోవాలని సూ చించారు అభివృద్ధికి కేరాఫ్గా పాలమూరు..
పాలమూరు నియోజకవర్గం ఈ ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించింది. గతంలో ఉన్న మహబూబ్నగర్ ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లా అయిందని.. మీ కళ్ల ముందే కనిపిస్తుందని అన్నారు. పెద్ద చెరువు ఒక మురికి గుంటలా ఉండేది.. నేడు ఎంత సుందరంగా మారిందో అన్నారు. ఇప్పుడు చెరువు కట్టపై వాకింగ్ చేస్తున్నారని చెప్పారు. మయూరీ పార్కును ఎకో పార్కుగా మార్చి కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు పేరు పెట్టారన్నారు. ఆ పార్కులో ఎక్కువగా వన్యప్రాణులు వస్తున్నాయి.. హైదరాబాద్ నుంచి వేరే సిటీల నుంచి ఇతర రాష్ర్టాల నుంచి ఈ పార్కును చూడడానికి వస్తున్నారంటే ఎంత గొప్పగా తీర్చిదిద్దారో.. అర్థమవుతుందన్నారు.. ఇక్కడకు వచ్చి చూసిన ప్రతి ఒక్కరూ ఎంత బాగుంది.. ఇంత మంచిగా చేసిం డా.. అంటూ కీర్తిస్తున్నారన్నారు. తెలంగాణలో ఏ నగరానికి లేనట్టుగా.. ఎక్కడా లేనటువంటి కేసీఆర్ ఎకో పార్కు ఇక్కడ ఉందన్నారు. సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణమ్మ, మాజీ మంత్రి పీ.చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కృష్ణమోహన్, కిషోర్, శివరాజ్, కట్ట రవి కిషన్రెడ్డి, సుధీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ ప్రజా ఆశీర్వాద సభలో 53 కుల సంఘాల నాయకులు పాల్గొనడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత కలిగిస్తుంది. ఈ సెగ్మెంట్ నుంచి బీఆర్ ఎస్ బీసీ నేత మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం… బీసీలను అణగదొక్కాలని చేస్తున్న ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో వేదికపై అన్ని కులాల నేతలు సీఎం కేసీఆర్తో వేదిక పంచుకోవడం సంచలనంగా మారింది. దీంతో పాలమూరు రాజకీయ పరిణామాలు మలుపు తిరిగాయి.
మహబూబ్గర్ అభివృద్ధిలో శ్రీనివాస్గౌడ్ తనదైన పాత్ర పోషించారని, పట్టుదల ఉన్న వ్యక్తి, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి శ్రీనివాస్గౌడ్ అని సీఎం కేసీఆర్ అన్నారు. నా వద్దకు వచ్చి ఐటీ టవర్ కావాలని పట్టుబట్టి ఇక్కడికి తీసుకొచ్చాడన్నారు. దివిటిపల్లి వద్ద రూ.10 వేల కోట్లతో అ మరరాజా ఫ్యాక్టరీని ఏర్పాటవుతుందని, మంత్రి శ్రీనివాస్గౌడ్ సహకారం లేకుంటే ఈ ఫ్యాక్టరీ వచ్చేదా అని ప్రశ్నించారు. ఎక్కడెక్కడ నుంచో పాలమూరకు రావాలి.. విద్య, వైద్యానికి అన్నింటికీ ఇక్కడికి రావాలి.. అంటూ వెంటబడి మరీ సాధించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఐదు మెడికల్ కాలేజీలు తెచ్చిన.. 60 ఏండుల పాలించిన కాంగ్రెసోళ్లు ఒక్క మెడికల్ కాలేజీ అన్నా తెచ్చా రా..? అని ప్రశ్నించారు. మహబూబ్నగర్లో ఎన్నో మంచి పనులు జరిగాయని, శ్రీనివాస్గౌడ్ను మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. గతంలో పాలమూరులో 14 రోజులకోసారి తాగునీరు సరఫరా అయ్యేది, కానీ నేడు మిషన్ భగీరథ ద్వారా నిత్యం శుద్ధమైన జలాలు నల్లాల నుంచి వస్తున్నాయన్నారు. అం దుకే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలని.. మంచి జరుగుతుందని గ్రామాల్లో.. పట్టణాల్లో చర్చ జరగాలని కేసీఆర్ కోరారు. ఈసారి శ్రీనివాస్గౌడ్ను గెలిపిస్తే మంచి పదవి ఇస్తామని, దీంతో జిల్లా అభివృద్ధికి బాటలు పడతాయని, అప్పుడు ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దుతారన్నారు.