హన్వాడ, అక్టోబర్ 19: ప్రతి గ్రామంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ వెంకట్రావు పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్ సంబంధిత రికార్డులను పరిశీలించారు. వ్యాక్సినేషన్ ఎన్ని గ్రామాల్లో పూర్తి అయింది తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలన్నారు. గ్రామాల ప్రజా ప్రతినిధులులతో సమావేశం నిర్వహించి అందరూ వ్యాక్సిన్ తీసుకునేలా కృషి చేయాలన్నారు. ఇప్పటి వరకు 35గ్రామ పంచాయతీల్లో 28గ్రామాలు వందశాతం పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. గ్రామాల్లో వలస వెళ్లిన వారి వివరాలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి వ్యాక్సిన్ వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్వో కృష్ణ, మండల వైద్యాధికారి ప్రీతి, ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఈవోపీఆర్డీ వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
మహ్మదాబాద్లో ..
మహ్మదాబాద్, అక్టోబరు 19 : మహ్మదాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 100శాతం కొవిడ్ నివారణ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో పీహెచ్సీలో టీకా కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులతో మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా వేయాలని తెలిపారు. కరోనాను పూర్తిగా అరికట్టాలంటే వందశాతం వ్యాక్సినేషన్తోనే సాధ్యమవుతుందని తెలిపారు. గ్రామాల్లో చాలా మంది మొదటి డోస్ వేసుకుని రెండో డోసు వేసుకోవడం లేదని ప్రతి ఒక్కరూ రెండు డోసులు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.