అలంపూర్, అక్టోబర్ 12 : ఆదిశక్తి జోగుళాంబ చల్ల ని దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్న ట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవా రం నిర్వహించే జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి క ల్యాణోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రభుత్వ ప రంగా దేవతా వస్ర్తాలను సమర్పించారు. ఆలయ పాలక మండలి చైర్మన్ రవి ప్రకాశ్గౌడ్, ఈవో వీరేశం, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు, నిబంధనల ప్రకారం లాంఛనంగా పట్టు వస్ర్తాలు సమర్పించినట్లు తెలిపారు. మంత్రి వెంట ఎం పీ రాములు, జెడ్పీ చైర్ పర్సన్ సరితాతిరుపతయ్య, ఎ మ్మెల్యే అబ్రహం ఉన్నారు.
ఆదిదంపతుల కల్యాణం.. కమనీయం
ఆదిదంపతుల కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి కల్యాణంలో జెడ్పీ చైర్పర్సన్ సరితాతిరుపతయ్య దంపతు లు, భక్తుడు శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు. ఆలయంలో స్వామి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు శాస్ర్తోక్తంగా కల్యాణం నిర్వహించారు. ఆదిదంపతుల మూల విరాట్లతో పల్లకీసేవ చేపట్టారు. సాయంత్రం సింహవాహనంపై అలంకరించి పురవీధుల గుండా ఊరేగించారు. కార్యక్రమం లో ఈవో వీరేశం, పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లాల్ దర్వాజ, సింహవాహిని, మహంకాళీ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో అమ్మ వారికి బంగారు బోనం, పట్టు వస్ర్తాలు సమర్పించారు.