కల్వకుర్తి, నవంబర్ 18: కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ, తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే డిమాండ్తో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన రైతు ధర్నాకు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.
తాడూరు మండలం నుంచి..
తాడూరు, నవంబర్ 18 : రైతులు యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో తలపెట్టిన మహాధర్నాకు మండలం నుంచి వందలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తరలివెళ్లారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవి, వైస్ఎంపీపీ శివలీల, మార్కెట్యార్డు వైస్చైర్మన్ జైపాల్రె డ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్, సింగిల్విండో చై ర్మన్ ఎండీ.సమద్పాషా, వైస్చైర్మన్ వెంకట్రెడ్డి, మండల ప్రధానకార్యదర్శి రాజుగౌడ్, నాయకులు బాల వెంకట య్య, బి.పరమేశ్వర్, శ్రీనివాసులు, పరమేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, రమణ, అనిల్రెడ్డి, రామస్వామి, వెంకట్రాంరెడ్డి, మశన్న, పర్వతాలు, కృష్ణయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
జిల్లాకేంద్రం నుంచి..
నాగర్కర్నూల్, నవంబర్ 18: హైదరాబాద్లో గురువారం నిర్వహించిన మహాధర్నాకు జిల్లా నుంచి టీఆర్ఎస్ శ్రేణు లు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని ఐదు మండలాల టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ధర్నాలో పాల్గొని మద్దతు పలికారు.
తెలకపల్లి నుంచి..
తెలకపల్లి, నవంబర్ 18 : తెలకపల్లికి చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు, రైతులు గురువారం హైదరాబాద్లో జరిగే రైతు మహాధర్నాకు తరలివెళ్లారు. వెళ్లిన వారిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హనుమంత్రావు, ఎంపీపీ మధు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నరేందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ భాస్కర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, పలువురు నాయకులు ఉన్నారు.
వెల్దండ నుంచి..
వెల్దండ, నవంబర్ 18: హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద గురువారం చేపట్టిన రైతు ధర్నాకు మండలం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. వెళ్లిన వారిలో ఆయా గ్రామాల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ రాష్ట్ర నేత శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపతిరెడ్డి, రవీందర్రావుతోపాటు సర్పంచులు ,ఎంపీటీసీలు ఉన్నారు.