జడ్చర్లటౌన్, అక్టోబర్ 19: మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం జడ్చర్ల పట్టణంలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో మిలాద్ ఉన్ నబీ పండుగను జరుపుకొన్నారు. మంగళవారం ఉదయం పట్టణంలోని అన్ని మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాదేపల్లి జామె మసీదులో ఆసారే ముబారక్ ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని పలు మసీదుల్లో అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. మైమన్ మసీదు నుంచి మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ప్రారంభించి, కావేరమ్మపేట జామె మసీదు వద్దకు చేరుకుంది. పట్టణంలోని గాంధీచౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, నేతాజీ చౌరస్తాల వద్ద యువకులు పాలషర్బత్, ఫలహారాలను పంపిణీ చేశారు. కావేరమ్మపేట జామె మసీదు వద్ద మర్కజీకమిటీ ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. రాజకీయ పార్టీల నాయకులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
అన్నదాన కార్యక్రమాలు
మున్సిపాలిటీ కేంద్రం, అమిస్తాపూర్తోపాటు పలు గ్రామాల్లో మిలాద్ ఉన్ నబీ వేడుకలను నిర్వహించారు. మసీదుల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకల్లో మున్సిపాలిటీ చైర్మన్ సత్తూర్బస్వరాజ్గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్తూర్ నారాయణగౌడ్, కౌన్సిలర్ రామకృష్ణ, కో ఆప్షన్ సభ్యులు అజీజ్, జాకీర్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఖదీర్, యాసీన్, అహ్మద్, సాయిలు, బాలస్వామి, మైనార్టీ నాయకులు మహెమూద్, జాహంగీర్పాషా, సలీం, సత్యనారాయణ, అశోక్, నారాయణ పాల్గొన్నారు.
ప్రవక్త జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
మహమ్మద్ ప్రవక్త ఆచరించిన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మహ్మదాబాద్ ముస్లిం పెద్దలు తెలిపారు. మంగళవారం ఉమ్మడి గండీడ్ మండల వ్యాప్తంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలను జరుపుకొన్నారు. మండల కేంద్రంలో మసీదు కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. స్థానిక పోస్టాఫీస్ నుంచి శోభయాత్ర ప్రారంభమై ప్రధాన రహదారి గుండా జిల్లా కేంద్రానికి చేరుకున్నది. కార్యక్రమంలో నిర్వాహకులు గౌస్, అతిక్, ఖాజామైనొద్దీన్, మహమ్మద్ ఇలియాజ్, జహంగీర్, ఎజాజ్, ఖదీర్, ఖుర్షీద్, గఫ్ఫార్, సాబేర్ పాల్గొన్నారు.
రక్తదాన శిబిరం
మిలాద్ ఉన్ నబీ వేడుకలను పురస్కంచుకొని జిల్లా కేంద్రంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. షాలీమార్ ఫంక్షన్హాల్లో సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ ప్రారంభించారు. మోతీనగర్ మసీద్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. వార్డుల్లో యువకులు అన్నదానం చేశారు. ఆల్ఫైజ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ ఆవరణలో పేదలకు అన్నం ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు మోసీన్ఖాన్, అన్వర్పాషా, ఆల్ఫైజ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జహంగీర్బాబా, మాజీ కౌన్సిలర్ ఖాజాపాషా, రషద్ఖాన్, నాయకులు ఖాలీద్నవీద్, వాజీద్ పాల్గొన్నారు.
నవాబ్పేటలో..
మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో మంగళవారం ముస్లింలు మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని ఘనంగా జరుపుకొన్నారు. సోమవారం రాత్రి మసీదుల్లో జగ్నేకే రాత్లో భాగంగా జాగారం నిర్వహించి..అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుడు తాహెర్, నాయకులు అబ్దుల్లా, ఫయాజ్, ఖాజా, షబ్బీర్, నసీర్ పాల్గొన్నారు.
ప్రత్యేక ప్రార్థనలు
మండల కేంద్రంతో పాటు, మసిగుండ్లపల్లి, రాణిపేట, బోయిన్పల్లి, వాడ్యాల్, తదితర గ్రామాల్లో మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో మసీద్ కమిటీ నిర్వాహకులు, మత పెద్దలు, పిల్లలు పాల్గొన్నారు.
కోయిలకొండలో..
మండలంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య, నిర్వాహకులు, కోఆప్షన్ సభ్యుడు ఖాజా, నజీమ్, హసన్చావూస్, సయ్యద్ సజీల్, అక్రమ్, రుస్తుమ్, రహమాన్, మోహీన్ఖాన్, చోటుఖాన్ పాల్గొన్నారు.
రెడ్క్రాస్ అనాథ ఆశ్రమంలో అన్నదానం
మిలాద్ ఉన్ నబీ వేడుకలను పురస్కరించుకొని మంగళవారం ఏనుగొండ అనాథ ఆశ్రమంలో ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో మహ్మద్జకీ, సమద్ఖాన్, రీగల్ రహెమాన్, రహీం పాల్గొన్నారు.
వైద్య, మున్సిపల్, పోలీసు సిబ్బందికి సన్మానం
దేవరకద్ర, చిన్న చింతకుంట మండలాల్లో ముస్లింలు మిలాద్ ఉన్ నబీ వేడుకలు జరుపుకొన్నారు. జుమ్మా మసీదులో అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థనలు నిర్వహించారు. దేవరకద్ర మండలం కౌకుంట్ల గ్రామంలో అన్నదానం చేశారు. చింతకుంటలో కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించిన వైద్యారోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు శాలువాతో సన్మానించారు. దవాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.