మహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 7 : ప్రైవే ట్ విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభు త్వం నెలకు రూ.10వేల ఆర్థికసా యం అందజేయాలని కోరారు. అలా గే ప్రైవేట్ విద్యాసంస్థలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశా రు. అనంతరం డీఈవో కార్యాలయ ఏడీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రాంచందర్జీ, మాధవి, నజియాసుల్తానా, అక్తర్బేగం,గోవర్ధనాచా రి, రవికుమార్, నర్సింహులు పాల్గొన్నారు.