కోడేరు, జూలై 18: నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తున్నదని స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ఎం మల్లేశ్ అనారోగ్యానికి గురై హైదరా బాద్లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. విషయాన్ని ఆగ్రామ టీఆర్ఎస్ నాయకులు ఎమ్మె ల్యే హర్షవర్ధన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే మల్లేశ్కు మెరుగైన వైద్యం కోసం సీఎం సహాయనిధినుంచి రూ. 45వేలు ఎల్వోసీని మంజూరు చేయించారు. ఎల్వోసీని ఆదివారం బాధిత కుటంబానికి అంద జేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ వివిధ అనారోగ్య కారణాలతో కార్పొరేట్ దవాఖానలో చికిత్సపొందే ఆర్థిక స్థోమత లేని సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ద్వారా ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తున్నదని అన్నారు. ఈ ఆపత్కాలంలోకూడా సామన్య మధ్యతరగతి వారికి మెరుగైన వైద్యం అందుతుందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వల్లనే అని ఎమ్మెల్యే అన్నారు. ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సీఎం కేసీఆర్కు మల్లేశ్ కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ప్రకటనలో పిలుపునిచ్చారు.
ప్రతిఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి వద్ద, పరిసరాల్లోనూ నీరు నిల్వలేకుండా చూసుకోవాలని, అలాగే నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంకులు, కూలర్లు, కుండల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే బీరం సూచించారు. ఈ చర్యల వల్ల దోమలు పెరగకుండా ఉంటాయని, అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఎమ్మెల్యే బీరం కోరారు.