‘నాడు వలసలకు కేరాఫ్గా ఉన్న పాలమూరు జిల్లా నేడు అభివృద్ధిలో అద్భుతహా అన్నట్లు తీర్చిదిద్దబడింది.. మంత్రి శ్రీనివాస్గౌడ్ పట్టుబట్టి నిధులు మంజూరు చేయిస్తున్నారు.. దీంతో ఎయిర్పోర్టు తప్పా మిగితావన్నీ జిల్లాలో ఏర్పడ్డాయి’.. అని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. గురువారం మహబూబ్నగర్ పాత కలెక్టరేట్ స్థానంలో రూ.300 కోట్లతో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవన పనులకు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, కలెక్టర్ వెంకట్రావుతో కలిసి మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రగతి పరుగులు పెడుతుంటే కొన్ని పార్టీల నాయకుల కండ్లు ఎర్రబడుతున్నాయని ధ్వజమెత్తారు. నూతన వైద్యశాల కోసం రూ.500 కోట్లయినా ఖర్చు చేసి క్యాన్సర్కు సైతం చికిత్స అందేలా ఏర్పాట్లు చేస్తా మన్నారు. నర్సింగ్ కళాశాలకు రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో గోస పడ్డాం.. నేడు అన్నీ సాధించుకుంటున్నామని పేర్కొన్నారు.
మహబూబ్నగర్, డిసెంబర్ 22 (నమ స్తే తెలంగాణ ప్రతినిధి) : ‘పాలమూరు అంటే పేదరికం, గంజి కేంద్రాలే కనబడుతుండె.. పేపర్, టీవీలు, కేంద్రం ఇచ్చిన రిపోర్టు చూసినా ప్రపంచం మొత్తంలో పాలమూరు వెనకబడింది అన్నట్లు ఉంటుండె. కానీ నేడు సీన్రివర్స్ అయింది.. పాలమూరు పచ్చబడుతుంటే కొందరి కళ్లు ఎర్రబడుతున్నాయ్’ అని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వెయ్యిపడకల దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. పాలమూరుకే వలసలు వచ్చేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.
బొంబాయి బస్సులు బంద్ అయినయ్, గంజి కేంద్రాలు కనపడ్తలేవన్నారు. ఉపాధి లేక వలసపోయిన జిల్లాలో నేడు పరిశ్రమలు, ఐటీ టవర్లు, కంపెనీలు, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించామన్నారు. జిల్లాపై సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమ, అనాటి వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి కృషి వల్లే మెడికల్ కాలేజీ వచ్చిందన్నారు. నర్సింగ్ కాలేజీ, పారా మెడికల్ కోర్స్ ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తామన్నారు. బీఎల్టీలో ఆరు రకాల మెడికల్ కోర్సులు కూడా వచ్చాయన్నారు. జిల్లాకు ఎయిర్పోర్ట్ తప్పా అని వచ్చాయని తెలిపారు.
సూపర్ స్పెషాలిటీ దవాఖానలో క్యాత్లాబ్, కాన్సర్, గుండె సంబంధిత రోగాలకు కూడా వైద్య సదుపాయలు ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు. దవాఖాన నిర్మాణానికి అవసరమైతే మరో రూ.500 కోట్లు వెచ్చిస్తామన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ తాగునీటికి ఇబ్బంది ఉన్న పాలమూరులో ఇండ్లు కట్టుకోవద్దని సలహా ఇచ్చిన పెద్దమనుషులు ఉన్నారని.. తెలంగాణ వచ్చాక పాలమూరు రూపురేఖలే మారిపోయాయన్నారు. హైదరాబాద్కు సమీపంలో ఉన్నందున అభివృద్ధి జరగడం లేదని, కృష్ణానది దిగువన ఉన్నందునే నీళ్లు వస్తలేవని కొందరు కల్లబొల్లి మాటలు చెప్పారన్నారు. కానీ, తెలంగాణ వచ్చాక అవన్నీ తప్పని నిరుపించామన్నారు.
అభివృద్ధిని విస్మరించిన సమైక్య నేతలు..
పాత కలెక్టరేట్ స్థలంలో సూపర్స్పెషాలిటీ దవాఖాన ఎందుకని, జనరల్ దవాఖానలోనే పరిధి పెంచుకుందామని చెప్పినా.. మంత్రి శ్రీనివాస్గౌడ్ వినలేదని మంత్రి హరీశ్రావు తెలిపారు. తమకు కచ్చితంగా సూపర్స్పెషాలిటీ దవాఖాన కావాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పట్టుబట్టిన విక్రమార్కుడిలా సాధించుకున్నాడన్నారు. హై దరాబాద్కే పరిమితమైన ట్యాంక్బండ్, శిల్పారామం, ఐటీ పరిశ్రమలను మహబూబ్నగర్లో నెలకొల్పుతున్నట్లు చెప్పారు. 70 ఏండ్ల కాలంలో సమైక్య నాయకులు అభివృద్ధిని విస్మరించారన్నారు. తొమ్మిదేండ్లపాటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాలమూరును దత్తత తీసుకుని చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. రాత్రి, పగలు శ్రమించి సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి అంటే ఇది.. అనేలా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. ప్రజలకు మంచి చేయాలనే తపనతో ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నారన్నారు. మాయమాటలతో కాలం వెల్లదీస్తున్న వారి మాటలను నమ్మాల్సిన అవసరం లేదన్నారు.
ఢిల్లీలో చక్రం తిప్పనున్న కేసీఆర్.. : మంత్రి శ్రీనివాస్గౌడ్
వైద్యం అందక ఎవరూ చనిపోవద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల సేవలందిస్తున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సమైక్య రాష్ట్రంలో జిల్లా జనరల్ దవాఖానలో ప్ర తి నెలా కేవలం 20-30 కాన్పులు మాత్రమే అయ్యేవని, ప్రస్తుతం దాదాపు 1200 డెలివరీలు అవుతున్నాయన్నారు. మెరుగైన వైద్యం అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. మన జిల్లా పేదరికాన్ని చూపించి.. ఆంధ్రా ప్రాంతానికి నిధులలు తరలించినట్లు గుర్తు చేశారు. ఒకప్పుడు వలసల జిల్లాగా ఉన్న పాలమూరుకే నేడు ఇతర ప్రాంతాల నుంచి వలసలు వస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో చ క్రం తిప్పడం ఖాయమన్నారు. మహబూబ్నగర్కు విమానాశ్రయం కూడా తీసుకొద్దామని.. ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరా రు.
అప్పన్నపల్లి వద్ద రెండో ఆర్వోబీ పనులు తుదిదశకు చేరుకున్నాయన్నారు. వెయ్యి పడకల సూపర్స్పెషాలిటీ దవాఖానను ఏర్పాటు చే సుకోవడం ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. స్వరాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. దేశంలోనే అతి పెద్దదైన కేసీఆ ర్ ఎకో అర్బన్ పార్కును పాలమూరులో ఏర్పాటు చేశామన్నారు. అ మరరాజా బ్యాటరీ కంపెనీ రావడంతో 10 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. చించోళి బైపాస్ పనులను త్వరలో ప్రారంభించుకుందామన్నారు. పారామెడికల్, నర్సింగ్ కళాశాల కోసం భవనాలను మంజూరు చేయాలని మంత్రి హరీశ్రావును కోరారు. అడిగిన వెంటనే మంజూరు చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ముందుచూపుతో అడుగులు : ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి
ప్రజల భవిష్యత్ అద్భుతంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ ఎంతో ఆ లోచిస్తుంటారని, ముందుచూపుతో అడుగులు వేస్తారని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేసేదేమీ లేకున్నా.. ప్ర చారం మాత్రం గొప్పగా ఉంటుదని, అలా చెబుతూనే ప్రజలను మో సం చేస్తుందన్నారు. నిరుపేదలను ఉన్నత స్థాయికి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మన అందరం ప్రభుత్వానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.