కల్వకుర్తి రూరల్, సెప్టెంబర్ 23 : బంగారం, నగదు ను రెట్టింపు చేస్తామని అమాయక ప్రజలను నమ్మించి వ స్తువులతో ఉడాయించిన వారిని పోలీసులు రిమాండ్కు తరలించారు. గురువారం కల్వకుర్తి పోలీస్స్టేషన్లో ఎస్సై మహేందర్ విలేకరులతో వివరాలు వెల్లడించారు. రాజస్థాన్కు చెందిన తారక్నాథ్, గుజరాత్కు చెందిన దిలీప్నాథ్ సాధువుల వేషంలో ప్రజలను మోసం చేస్తుండేవా రు. ఈ నెల 14న కల్వకుర్తిలోని అశోక థియేటర్ సమీపంలో ఆనంద్, ప్రసాద్ (వరుసకు అన్నదమ్ము లు) వ్యా పారాలు చేస్తున్నారు. వారి వద్దకు వెళ్లి ‘ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. పూజలు చేస్తే ధనవంతుడిగా మా రిపోతారు’ అని మాయమాటలు చెప్పి వారికి విభూతి ఇతర సామగ్రి అందించారు. దుకాణం వద్ద కాకుండా ఇంటి వద్ద పూజలు చేయాలని చెప్పారు. వారి మాటలు నమ్మిన ఆనంద్ తన స్వగ్రామమైన పంజుగుల గ్రామానికి తీసుకెళ్లాడు. ఆనంద్ నుంచి రెండు తులాల బంగారం, రూ.25 వేలు తీసుకొని పూజలు ప్రారంభించారు. బంగారాన్ని కుండలో ఉంచి ఎర్రటి గుడ్డను కట్టి వారిని మా యాజాలం చేసి అందులోని బంగారం, నగదును మా యం చేశారు. తాము చెప్పేంత వరకు కుండలోని బంగారాన్ని తీయొద్దని చెప్పి హైదరాబాద్కు వెళ్లారు. రెండు రోజుల తర్వాత మోసగాళ్లకు బాధితులు ఫోన్ చేయగా రూ.75 వేలు డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన బా ధితులు కుండలో చూడగా బంగారం కనిపించకపోవడం తో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకు న్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మోసాలకు పా ల్పడిన వారిని హైదరాబాద్లో పట్టుకొని, వారి వద్ద నుంచి రెండు తులాల బంగారం చైన్, రూ.25 వేలు, ఆనంద్ దుకాణం నుంచితీసుకెళ్లిన మిక్సర్గ్రైండర్, హాట్ ప్యాక్లు, రెండు ఫ్యాన్లు, బ్లూటూత్, వాటర్ హీటర్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. కేసును వేగంగా దర్యాప్తు చేసిన హెడ్ కానిస్టేబుళ్లు ముజీబ్, రాజవర్ధన్రెడ్డిలను సీఐ సైదులు అభినందించా రు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దొంగబాబాలు, సాధువులు చెప్పే మాయమాటలు నమ్మవద్దని అత్యాశకు పోయి నష్టపోవద్దని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. సమావేశంలో శిక్షణ ఎస్సై రుమేనా ఉన్నారు.