గద్వాల/ధరూర్, జూలై 16 : గుడ్డెందొడ్డి రిజర్వాయర్ పరిధిలో 99 ప్యాకేజీలో నిర్మించిన కా లువ కోతకు గురి కావడంతో 9 గ్రామాలకు దారి మళ్లింపుతోపాటు పంట పొలాలు నీట మునిగిన ఘటన ధరూర్ మండలంలో చోటు చేసుకున్నది. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ నుంచి 99 ప్యాకేజీ ద్వా రా అధికారులు పంటలకు నీరు వదిలారు. మూ డ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాలువ కట్టమెత్త పడింది. రిజర్వాయర్ నుంచి నీటిని వదిలే సమయంలో తూం గేటు ఎక్కువగా తెరవడంతో నీటి ప్రవాహానికి కాలువ కోతకు గురైంది. నీరంతా వృథాగా కిందికి పారింది. దీంతో జీరబండ, వా మన్పల్లి, గుడ్డెందొడ్డి గ్రామాల రైతులు సాగు చేసిన వరి, పత్తి పంటలు నీటిలో కొట్టుకుపోయా యి. గుడ్డెందొడ్డి, మాల్దొడ్డి, ద్యాగదొడ్డి, నాగర్దొడ్డి, ఖమ్మంపాడ్, ఉప్పేరు, నెట్టెంపాడ్, గార్లపా డ్ గ్రామాలకు వెళ్లే వారు ఇతర ప్రాంతాల నుంచి వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉద యం నుంచి తూం గేటు బంద్ చేయడానికి అధికారులు ప్రయత్నించినా గేట్లు జామై కిందకు దిగలేదు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సహకారంతో జేసీబీ తెప్పించి కాలువకు గండి కొట్టి నీరం తా జూరాలకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.
గుడ్డెందొడ్డి కాలువ కోతకు గురైందన్న విష యం తెలుసుకున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి వెం టనే అక్కడకు చేరుకొని వర్షం పడుతున్నా లెక్క చేయకుండా అధికారులను సమన్వయపరుస్తూ జేసీబీతో పనులు చేయించారు. పనులు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి ట్రాక్టర్ ద్వారా గడ్డి తెప్పించి రిజర్వాయర్ నుంచి నీరు కిందకు రాకుండా అడ్డుకట్ట వేయించారు. కాలువ మరింత కోతకు గురైతే ఎక్కువగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదని గు ర్తించిన ఎమ్మెల్యే జేసీబీ తెప్పించి కాలువకు గండి కొట్టించి నీరు నదిలోకి వెళ్లేలా కృషి చేశారు. ఎమ్మెల్యేతో ఈఈ రహిముద్దీన్ సమన్వయం చేసుకుం టూ సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. రై తులు ఎవరూ అధైర్యపడొద్దని, అండగా ఉంటామని ఎమ్మెల్యే బండ్ల భరోసానిచ్చారు. గుడ్డెందొడ్డి జలాశయం గేట్లో సాంకేతిక లోపంతో కాలువ సామర్థ్యాన్ని మించి నీటిని విడుదల చేయడంతో కోతకు గురైందని తెలిపారు. గేట్లను మూసేందుకు సాగునీటి శాఖ అధికారులు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ రఘురాం శర్మ కూడా తూం గేట్లను పరిశీలించా రు. ఎమ్మెల్యే వెంట గుడ్డెందొడ్డి సర్పంచ్ రఘురె డ్డి, గట్టు ఎంపీపీ విజయ్కుమార్ ఉన్నారు.