ఊట్కూర్, అక్టోబర్ 12 : ఆడపడుచులకు బతుకమ్మ చీరెల పంపిణీ ప్రారంభంతో రంగురంగుల సారెలు అందుకుంటున్నారు. ప్రభుత్వం చీరెలు పంచడంతో మహిళలు ఆనందంతో స్వీకరించి ఆనందిస్తున్నారు. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బతుకమ్మ సంబురాలను ప్రతి ఏ డాది సర్కార్ నిర్వహిస్తూ వస్తున్నది. చీరెల పంపిణీని ప్రభు త్వం ఐకేపీ, మహిళా సమాఖ్యకు అప్పగించింది. మండలకేంద్రంలో చీరెల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై శ్రీకారం చుట్టారు. మ హిళలు దసరా, బతుకమ్మ పండుగలను ఆనందంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఏ డాది మెదటి విడుతలోనే వందశా తం చీరెలను పంపిణీ చేయడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో చీరెల పంపిణీని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారం భించగా ఉత్సాహంగా సంబురాల్లో పాల్గొంటున్నారు.
18,956 మంది లబ్ధిదారులు..
మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో 18,956 మంది లబ్ధిదారులకు బతుకమ్మ చీరెలను ప్రజాప్రతినిధు లు, అధికారులు అందజేస్తారు. అన్ని గ్రామాల్లో తెల్ల రేషన్కార్డు ఆధారంగా 18 ఏండ్లు పైబడిన ప్రతి మహిళకు బ తుకమ్మ చీరెను పంపిణీ చేశారు.
లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి చీరెలు అందేవిధంగా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ప్రతి ఒక్క మహిళలకు చీరె అందే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. మండలంలో 26 రేషన్ దుకాణాలు ఉండగా అందులో తెల్ల రేషన్కార్డులు కలిగిన 18 వేలకు పైగా ఆడపడుచులు చీరెలను అందుకుంటున్నారు.
ఆనందంగా ఉంది..
మహిళలపై ఉన్న అభిమానంతో సీఎం కేసీఆర్ మహిళలకు చీరెలు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు పక్క రాష్ర్టాల్లో ఎక్కడ కూడా అమల్లో లేవు. మహిళలను చైత న్యం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
గర్వంగా ఉంది..
బతుకమ్మ చీరెలను ప్రభుత్వం అందించటం ఎంతో ఆనందంగా ఉంది. మహిళా ప్రజాప్రతినిధి గా మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఆదరణకు గర్వపడుతున్న. ప్రతి మహిళ ప్రభుత్వాన్ని దీవించాలి.