జగదేవ్పూర్ ఏప్రిల్ 30 : వానకాలం ప్రారంభమయ్యే నాటికి నర్సరీల్లోని మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలని మండల అభివృద్ధి అధికారి మల్లికార్జున్ తెలిపారు. శుక్రవారం సర్పంచ్ భాణుప్రకాశ్ ఎంపీవో శ్రీనివాసవర్మతో కలిసి మండలంలోని తీగుల్ గ్రామంలో పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న ఈజీఎస్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈజీఎస్ కూలీలు, సిబ్బంది పనులు చేసేటప్పుడు తప్పనిసరిగా మాస్క్, భౌతికదూరం పాటించాలన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలు ఏపుగా పెరిగేలా చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శి లావన్యకు సూచించారు.