మెట్పల్లి రూరల్, మార్చి 28: మెట్పల్లి మండలం పెద్దాపూర్ శ్రీ మల్లికార్జున స్వామి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి పోటెత్తిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిపోయాయి. మహిళలు బోనాలను భక్తులు నెత్తిన ఎత్తుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారికి సమర్పించారు. సాయంత్రం సుమారు 60 వేల మందికి పైగా మహిళలు బోనాలు నెత్తిన ఎత్తుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్వామికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గొర్రెపిల్లను, బెల్లాన్ని కానుకగా సమర్పించారు. ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలు, పోతరాజులు, డోలు కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం స్వామి రథోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు దంపతులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవి, జడ్పీటీసీ రాధాశ్రీ, ఎంపీపీ సాయిరెడ్డి, ఎంపీటీసీ శంకరయ్య, ఉపసర్పంచ్ గంగాధర్, ఆలయ కమిటీ అధ్యక్షుడు రమేశ్, ఉపాధ్యక్షులు రాజరెడ్డి, రమేశ్, నాయకులు కాటిపెల్లి శ్రీనివాస్రెడ్డి, రఘుపతిరెడ్డి, జీవన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
ఈ నెల 15 తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు