కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్
ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి అధికారులతో సమీక్ష
ఆసిఫాబాద్, జూన్ 16 : జిల్లా కేంద్రంలో అక్రమంగా నిర్మించిన కట్టాడాలను వెంటనే తొలగించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పట్టణంలో నీరు నిల్వ ఉన్నచోట వెంటనే తొలగించడంతో పాటు డ్రైనేజీలు నిర్మించాలన్నారు. జూబ్లీ మార్కెట్లో తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, పీఆర్ ఈఈ రామ్మోహన్రావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వెంకటపతి, ప్రత్యేక అధికారి రమేశ్, కార్యదర్శి రాజబాబు పాల్గొన్నారు.
వారంలోగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి
వారం రోజుల్లోగా గిరివికాసం పథకం లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఐటీడీవో పీవో భవేశ్ మిశ్రా, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరివికాస్ పథకం ద్వారా వ్యవసాయ అభివృద్ధి కోసం బోరు వేసి , కరెంట్, పంపు సదుపాయం కల్పిస్తామన్నారు. డీఆర్డీవో రవికృష్ణ, విద్యుత్ ఏడీ శ్రీనివాస్ పాల్గొన్నారు.