పిల్లల నుంచి వృద్ధుల వరకూ సంక్షేమ పథకాలు
బతుకమ్మ చీరెల పంపిణీలో ఎమ్మెల్యేలు కోనప్ప, దివాకర్రావు, చిన్నయ్య
బెల్లంపల్లిటౌన్, అక్టోబర్ 3 : మహిళల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, వారి అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. పట్టణంలోని పద్మశాలీ భవన్లో ఆదివారం బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, తదితర సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యు లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
అత్యధికంగా పింఛన్ ఇస్తున్నది టీఆర్ఎస్ సర్కారే
కాసిపేట, అక్టోబర్ 3 : టీడీపీ పాలనలో రూ.75 పింఛన్ ఉండేదని, పింఛన్దారుడు చనిపోతేనే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి మంజూరు చేసేవారని, కాంగ్రెస్ పాలనలో రూ.200 మా త్రమే పింఛన్ ఇచ్చేవారని, కానీ టీఆర్ఎస్ సర్కా రు రూ.2 వేలు ఇచ్చి ఆదుకుంటున్నదని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గుర్తు చేశారు. ఆదివారం కాసిపేటలో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మి, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రంరావు, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు దుర్గం పోశం, తహసీల్దార్ భూమేశ్వర్, సహకార సొసైటీ చైర్మన్ నీలా రాం చందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, ఎంపీటీసీలు కొండబత్తుల రాంచందర్, అక్కెపల్లి లక్ష్మి, సర్పంచ్లు ఆడె బాదు, సునీత, సపాట్ శంకర్, శ్రీనివాస్, తిరుపతి, సంపత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజులారెడ్డి, మాజీ జడ్పీటీసీ రౌత్ సత్తయ్య, ఆర్ఐ సులోచన, ఉప సర్పంచ్లు బోయిని తిరుపతి, పిట్టల సుమ డన్, కోఆప్షన్ సిరాజ్ఖాన్, నాయకులు మోటూరి వేణు, అగ్గి సత్తయ్య, చింతల భీమయ్య, బింగి శ్రీనివాస్, జాడి శివ, మాసు సుధాకర్, లంక లక్ష్మణ్, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి మండలంలో..
బెల్లంపల్లిరూరల్, అక్టోబర్ 3: బెల్లంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ చీరెల పంపి ణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రార ంభించారు. రాష్ట్రంలో నేతన్నల ఆత్మహత్యలను ఆపేందుకు రూ.330 కోట్ల నిధులను ప్రభుత్వం బతుకమ్మ చీరెల తయారీకి వినియోగిస్తున్నదని తెలిపారు. ఐకేపీ భవనం ఏర్పాటుకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షురాలు వెంబడి రాణి, ఎంపీడీవో డీ రాజేందర్, పంచాయతీరాజ్ ఏఈ పరంజ్యోతి, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, ఏపీఎం శ్యామల, ఏపీవో ఎస్డీ జీనత్, ఎంపీవో వీ. శ్రీనివాస్, సర్పంచ్లు జిల్లపల్లి స్వరూప, వేముల కృష్ణమూరి, అశోక్గౌడ్, రాజమొగిలి, ప్రమీలాగౌడ్, రంజిత, వెంకటేశ్, అశోక్కుమార్, పోలవేని మాధవి, ఎంపీటీసీలు పీ సుభాష్రావు, పాయవేణి అంకు, శంకరమ్మ, కలాలి శకుంతల, నాయకులు దుర్గం గోపా ల్, వెంకటేశ్వర్గౌడ్, బడికెల శ్రావణ్తో ఐకేపీ సిబ్బంది, మండలంలోని పలువురు నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
ఆడబిడ్డలకు పండుగ కానుక బతుకమ్మ సారె..
చింతలమానేపల్లి, అక్టోబర్ 3 : ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ కానుకగా చీరెలను సీఎం కేసీఆర్ పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఆదివారం మండలంలోని డబ్బా, బాబాసాగర్ గ్రామాల్లో బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. మండలంలో బాబాసాగర్ నుంచి నాయికపుగూడకు వెళ్లే వాగుపై వంతెన నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ డుబ్బుల నానయ్య, జడ్పీటీసీ శ్రీదేవి, కో ఆప్షన్ సభ్యుడు నాజీం హుస్సేన్, సర్పంచ్లు తహేర బేగం, సుశీల, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు డుబ్బుల వెంకన్న, రైతు బంధు సమితి మండల కన్వీనర్ నారాయణ, నాయకులు హరీశ్, నీలాగౌడ్, సాగర్, భాస్కర్, మల్లేశ్, రషీద్, నాందేవ్ తదితరులున్నారు.
కౌటాల మండలంలో..
కౌటాల, అక్టోబర్ 3 : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని మతాల పండుగలకు ప్రాధాన్యమిచ్చి, ఘనంగా నిర్వహిస్తున్నారని సీఎం కేసీఆర్ను కొనియాడారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 33 లక్షలతో ప్రహరీలను నిర్మిస్తామని తెలిపారు. కౌటాల, సిర్పూర్(టీ), చింతలమానేపల్లి, బెజ్జూర్ మండలాల ప్రజల కోసం రూ.58 కోట్లతో 132 కేవీ సబ్స్టేషన్ మంజూరు చేయించినట్లు ఆయన తెలిపారు. రవీంద్రనగర్ నుంచి సలుగుపల్లి, బెజ్జూర్ నుంచి డబ్బా వరకు రెండు లేన్లరోడ్డు పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. గుండాయిపేట వద్ద పెన్గంగ నదిపై త్వరలో వంతెనను నిర్మించేందుకు సీఎం కేసీఆర్కు విన్నవిస్తానని తెలిపారు. చెక్డ్యామ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్, జ డ్పీటీసీ అనూష, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమ్రం మాంతయ్య, రైతు బంధు సమితి కన్వీనర్ బ్రహ్మయ్య, సర్పంచ్ మౌనిశ్, ఎంపీడీవో నస్రూల్ల ఖాన్, ఎంపీవో శ్రీధర్ రాజు, ఏపీఎం వెంకటరమణ, ఉపసర్పంచ్ తిరుపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వసంత్ రావు, యువజన సంఘం మండల అధ్యక్షుడు తాళ్లపల్లి రవీందర్ గౌడ్, మహిళా సంఘం అధ్యక్షురాలు శైలజ గౌడ్, మాజీ ఎంపీపీ గంగారాం, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలున్నారు.
అభివృద్ధిలో మనమే ముందున్నాం : మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు
లక్షెట్టిపేట రూరల్, అక్టోబర్ 3: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. లక్ష్మీపూర్, రంగపేట, చం దారం, దౌడేపల్లి, హన్మంతు పల్లెల్లో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తాము తపన పడుతుంటే ఇది గిట్టని ప్రతి పక్షాలు ప్రజలను మభ్యపెట్టేందుకు దొంగ యాత్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఆయా కార్యక్రమాల్లో డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగయ్య, డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ వేముల రాజ్కుమార్, ఎంపీటీసీ కల్లు దావీదు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, చిప్పకుర్తి నారాయణ, శాఖపురం శంకరయ్య, గంగుల రామ్మూర్తి, కందుల లక్ష్మణ్, సాలకుల శ్రీనివాస్, వజ్ర, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్, సీఏ చంద్రకళ, గంగుల లచ్చన్న, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
హాజీపూర్ మండలంలో..
హాజీపూర్, అక్టోబర్ 3 : దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. మండలంలోని గుడిపేట, నంనూర్, రాపల్లి, కర్నమామిడి, పడ్తన్పల్లి, దొనబండ గ్రామాల్లో ఆదివారం చీరెల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్ తహసీల్దార్ వాసం తి, ఆయా గ్రామాల సర్పంచ్లు లగిశెట్టి లక్ష్మి-రాజయ్య, బేర పద్మ, ఆనె మల్లేశ్, కొట్టె మహేందర్, గొళ్ల శ్రీనివాస్, జడ్పీటీసీ పూస్కూరి శిల్ప, ఎంపీపీ మందపెల్లి స్వర్ణలత-శ్రీనివాస్, వైస్ ఎంపీపీ బేతు రవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జీవన్ రావు, మండల నాయకులు పాల్గొన్నారు.
దండేపల్లి మండలంలో..
దండేపల్లి, అక్టోబర్3 : దండేపల్లితో పాటు రెబ్బెన్పెల్లి, నెల్కివెంకటాపూర్, ముత్యంపేటలో బతుకమ్మ చీరెలను ఎమ్మెల్యే దివాకర్రావు పంపిణీ చేశారు. రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ గురువయ్య, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, వైస్ చైర్మన్ రవి, సర్పంచ్లు కందుల కల్యాణి, విఠల్, జాడి తిరుపతి, ఎంపీటీసీలు బత్తుల మౌనిక, మాళిక, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేని శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు కందుల అశోక్, బత్తుల శేఖర్, చీర్ల వెంకటేశ్వర్లు, గోళ్ల రాజమల్లు, శంకర్రావు, పత్తిపాక సంతోష్, నలిమెల మహేశ్, దమ్మ సునీల్, గొల్లపెల్లి అజ య్, ఒడ్డె ప్రభాకర్, గడిపెల్లి సత్యం, లింగారెడ్డి, బొలిశెట్టి రమేశ్, సుధీర్వర్మ, తదితరులున్నారు.