మధిర : అంతర్గత రహదారుల నిర్మాణంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని పలుగ్రామాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పర్యటించారు. ఎర్రుపాలెంమండలం రేమిడిచర్ల గ్రామంలో సీడీఎఫ్ నిధులు రూ.17 లక్షలతో నిర్మిస్తున్న సీసీరోడ్డుకు, జడ్పీనిధులు రూ.5 లక్షలతో నిర్మిస్తున్న సీసీడ్రైయిన్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి అటెండెంట్ రిజిష్టర్లను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, సర్పంచ్లు పురుషోత్తం, మొగిలి అప్పారావు, సొసైటీ అధ్యక్షుడు మూల్పూరి శ్రీనివాసరావు, ఎంపీటీసీలు ఎం.అప్పమ్మ, మస్తాన్వలీ, కృష్ణారావు, కిషోర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, మండల అధ్యక్షుడు శీలం ఉమామహేశ్వరి, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు కొండేపాటి సాంబశివరావు, కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, మురళీ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.