ముదిగొండ/ చింతకాని, మార్చి 29: జీవో నెంబర్ 58తో పేదల సొంత జాగా కల సాకారమైందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. ముదిగొండ తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో జీవో 58 కింద ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరణ అయిన లబ్ధిదారులకు పట్టాలను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఏళ్లకేళ్లుగా నివసిస్తున్న పేదలకు ఈ జీవో ద్వారా సీఎం కేసీఆర్ హక్కులు కల్పించారని వివరించారు. జీవో 59 లబ్ధిదారులకు కూడా త్వరలోనే పట్టాలు అందిస్తామని వివరించారు. ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు సామినేని హరిప్రసాద్, పసుపులేటి దుర్గ, తుపాకుల యలగొండస్వామి, శిరీష, వాచేపల్లి లక్ష్మారెడ్డి, మందరపు లక్ష్మి, తుపాకుల రమాదేవి, కోటి అనంతరాములు, బత్తుల వీరారెడ్డి, పసుపులేటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
చింతకానిలో..
చింతకాని తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఐదు గ్రామాలకు చెందిన 93 మంది లబ్ధిదారులకు జీవో 58, 59లకు చెందిన భూ యాజమాన్య హక్కు పత్రాలను జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు బుధవారం పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు చాట్ల సురేశ్, బండి సుభద్ర, మంగీలాల్, కోపూరి పూర్ణయ్య, పర్చగాని తిరుపతి కిశోర్, గురజాల హనుమంతరావు, పెంట్యాల పుల్లయ్య, మంకెన రమేశ్, బోగ్గారపు రాంబాబు, గడ్డం శ్రీను, నూతలపాటి వెంకటేశ్వర్లు, బండి రామారావు, ఆవుల నాగేశ్వరరావు, గిర్దావర్లు పగడాల ఉష, సత్యావతి పాల్గొన్నారు.