మధిర/మధిర టౌన్, జూలై 2: మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా బోనకల్లు మండలానికి చెందిన బంధం శ్రీనివాసరావు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా మధిరలో ప్రమాణ స్వీకార సభా స్థలాన్ని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు ఆదివారం పరిశీలించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బంధం శ్రీనివాసరావు, రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, కరివేద సుధాకర్, కోనా నరేందర్రెడ్డి, అయిలూరి ఉమామహేశ్వరరెడ్డి, కోన నరేందర్రెడ్డి పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి
ఎర్రుపాలెం, జూలై 2: మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో సోమవారం జరుగనున్న ఏఎంసీ నూతన చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎర్రుపాలెం మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, కార్యదర్శి యన్నం శ్రీనివాసరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. చైర్మన్గా బంధం శ్రీనివాసరావు, డైరెక్టర్లుగా శీలం కృష్ణారెడ్డి, కాలసాని వెంకటనారాయణ, తలుపు విజయబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు.