మధిర: మధిర మండల కేంద్రంలోని మండల పరిషత్ డెవలప్మెంట్ (ఎంపీడీఓ) కార్యాలయాన్ని సోమవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిష్టర్లు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు ఎవరెవరు ఏ టైం కు వస్తున్నారో ఆరా తీశారు. అధికారులకు ఆయన పలుసూచనలు చేశారు.