రామవరం ఆగస్టు 24 : ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోగల పాల్వంచలోని నవభారత్లో గల మైనారిటీ గురుకుల కళాశాల నందు బాలుర కోసం, ఖమ్మంలోని రాపర్తి నగర్లో గల బాలికల కళాశాలలో బాలికలకు ఈ విద్యా సంవత్సరం నుండి సీఓఈ కళాశాలలను మంజూరు చేయడం పట్ల మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ యాకూబ్ పాషా హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేట్ కళాశాలకు దీటుగా మైనారిటీ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని ఉద్దేశంతో నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలలో శిక్షణ అందించి వారిని డాక్టర్లు, ఇంజినీర్లుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మైనారిటీ గురుకుల కార్యదర్శి బి. షఫీఉల్లా నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరం నుండి 15 సీఓఈ కళాశాలలు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ కళాశాలలో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు ఈనెల 26 లోపు ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని, అదేవిధంగా ఈనెల 29 న నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరు కావాలని సూచించారు. కావున, మైనారిటీ వర్గాలకు చెందిన ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్, బౌద్, పార్సి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియేగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాల కొరకు 789311 6918, 9154365017లలో సంప్రదించాలన్నారు.