రఘునాథపాలెం, నవంబర్ 26: ప్రతిఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదేనన్నారు. అనంతరం అధికారులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్) సుభాశ్చంద్రబోశ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం జరిగింది. వేడుకలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ప్రసన్నకుమార్, ఏవో అక్తరున్సీసా బేగం, ఆర్ఐ రవి, సీఊ తుమ్మా గోపి పాల్గొన్నారు. నగరంలోని ఎస్సీ బాలుర వసతి గృహం-బి లో సంక్షేమశాఖ అధికారి కోటపాటి రుక్మారావు అంబేద్కర్ చిత్రపటానికి నివాళి అర్పించారు.
ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్ 26: ప్రతి విద్యార్థికీ ఒక లక్ష్యం ఉండాలని జిల్లా జడ్జి డాక్టర్ తట్టా శ్రీనివాసరావు సూచించారు. విద్యార్థి దశ నుంచే కష్టపడి చదివి ఆ లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నగరంలోని సెయింట్ జోసెఫ్స్ స్కూల్లో శనివారం నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆయన మాట్లాడారు. సైబర్ వరల్డ్ ప్రోగ్రామ్, స్విమ్మింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కరస్పాండెంట్ సుఫిరియాడర్ సిస్టర్ విజయమేరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ కేఎస్ఎస్ రత్నప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ధనమూర్తి, రవివర్ధన్, మిల్టన్, నరసింహారావు, వేణుమాధవ్, సత్యవతి, సీతారాం తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సర్వజ్ఞ పాఠశాలలో విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. పాఠశాల డైరెక్టర్ రాజా వాసిరెడ్డి నాగేంద్రకుమార్, డైరెక్టర్ కొలిపార నీలిమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.