కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 23 : సింగరేణి సంస్థ 134వ ఆవిర్భావదిన వేడుకలు శుక్రవారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో ఘనంగా జరిగాయి. ఉదయం సింగరేణి డైరెక్టర్(పా, ఆపరేషన్స్) చంద్రశేఖర్ సింగరేణి పతాకం, బెలూన్లను ఎగురవేశారు. వివిధ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను ప్రారంభించారు. కార్యక్రమంలో డైరెక్టర్(ఫైనాన్స్, పీపీ) బలరాం, డైరెక్టర్ ఈఅండ్ఎం సత్యనారాయణరావు, జీఎం పర్సనల్(వెల్ఫేర్, ఆర్సీ) బసవయ్య, జీఎం పర్సనల్(ఐఆర్ అండ్ పీఎం) ఆనందరావు, జీఎం ఈఈ సీఎస్ఆర్ కుమార్రెడ్డి, జీఎం సెక్యూరిటీ హనుమంతరావు, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన జీఎంలు, హెచ్వోడీలతోపాటు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావ్, ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, టీబీజీకేఎస్ కార్పోరేట్ ఉపాధ్యక్షుడు ముప్పాని సోమిరెడ్డి, జేబీ మోహన్, అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.