కారేపల్లి, ఆగస్టు 26: వివిధ పథకాలను అమలు చేస్తూ ఆయా వర్గాల పేదల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపుతున్నారని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో పెనుమార్పులు తెస్తున్నారని అన్నారు. మండల కేంద్రంలో దళితబంధు ఆర్థిక సాయంతో నూతనంగా ఏర్పాటు చేసిన యూనిట్ను శుక్రవారం ఆయన రాములునాయక్ ప్రారంభించి మాట్లాడారు. దళితబంధు పథకం ద్వారా పేద దళితులకు ఆర్థిక సాయం అందించి వ్యాపార రంగంలో ప్రోత్సహించడం దేశానికి ఆదర్శమని అన్నారు.
రాష్ట్రంలో మూడోసారి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమన్నారు. అనంతరం సూర్యతండా, బీక్యాతండాల్లో పలు కుటుంబాలను పరామర్శించారు. వైఎస్ఎన్ గార్డెన్లో 11 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ముత్యాల సత్యనారాయణ, మాలోత్ శకుంతల, తోటకూరి రాంబాబు, అజ్మీరా వీరన్న, మల్లేల నాగేశ్వరరావు, గుగులోత్ శ్రీను, రావూరి శ్రీనివాసరావు, ఆదెర్ల స్రవంతి, నర్సింగ్ శ్రీనివాసరావు, ఇమ్మడి తిరుపతిరావు, ఎండీ అనీఫ్, పిల్లి వెంకటేశ్వర్లు, పప్పుల నిర్మల, బిందె రమేశ్, బానోత్ పద్మావతి, అడ్డగోడ ఐలయ్య, షఫీ తదితరులు పాల్గొన్నారు.