చింతకాని, డిసెంబర్ 28 : ఆళ్ళ వెంకటేశ్వర్లు మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరనిలోటు అని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ లోక్సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని తిమ్మినేనిపాలెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు వెంకటేశ్వర్లు(60) అనారోగ్యంతో మంగళవారం మృతిచెందారు. బుధవారం ఆయన మృతదేహాన్ని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, కోటా రాంబాబులతో కలిసి సందర్శించి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వెంకటేశ్వర్లు కుటుంబం నిరంతరం ప్రజాసేవకు అంకితమైందని, విలువలు కలిగిన నాయకుడని కోల్పోవడం బాధాకరమన్నారు. నివాళి అర్పించిన వారిలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, జడ్పీటీసీ పీటీ కిశోర్, సర్పంచ్ దమ్మాలపాటి శ్రీదేవి, నాయకులు హనుమంతరావు, రమేశ్, వెంకటేశ్వరరావు, వెంకటలచ్చయ్య, రామారావు, పానకాలు, జగన్మోహన్రావు, మధార్, నరేశ్, గ్రామశాఖ నాయకులు ఉన్నారు.