Vanajeevi Ramaiah | కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 13: పద్మ శ్రీ వనజీవి రామయ్య ఎందరికో ఆదర్శమని తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు , నిర్భయ ఆర్గనైజేషన్ ఫౌండర్,న్యాయవాది మల్లెల ఉషారాణి అన్నారు . ఆదివారం వనజీవి రామయ్య పార్థివదేహానికి ఆమె నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మల్లెల ఉషారాణి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు పచ్చని చెట్ల ప్రాముఖ్యతను గుర్తెరిగి, తన జీవితంలో ఎన్నో మొక్కలను నాటి, ఎందరినో మొక్కలు నాటేట్లుగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లాలోని కుగ్రామమైన రెడ్డిపల్లికి చెందిన వనజీవి రామయ్య భారతదేశం గర్వించే విధంగా పద్మశ్రీ అవార్డును తెచ్చుకున్న ధన్యజీవి అయ్యారని పేర్కొన్నారు. వనజీవి రామయ్య మానవ చరిత్ర ఉన్నంత కాలం ఆయన నాటిన ప్రతీ మొక్కలో సజీవంగానే ఉంటారని అన్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమ తమ పుట్టిన రోజులు, ప్రత్యేక రోజుల సందర్భంగా ఒక మొక్కను నాటి అతని కోరికను, నెరవేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమం TJS రాష్ట్ర నాయకులు, మల్లెల రామనాథం, కుమ్మర సంఘం రాష్ట్ర నాయకులు కుదురుపాక నరసయ్య, మల్లెల లక్ష్మీపతి , అనిత, రేణిగుంట్ల రవిచంద్ర, దరిపల్లి కిరణ్, దరిపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.