కొణిజర్ల, డిసెంబర్ 1: తెలంగాణ రాష్ట్రమంటే సీఎం కేసీఆర్ ఇలాఖా అని, ఇక్కడ బీజేపీ కుయుక్తులు సాగవని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. బీజేపీ నేతలు ఊరూరా క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నా ఒక్క సీటును కూడా గెలువలేరని అన్నారు. మండలంలోని దిద్దుపూడి, లాలాపురం, పల్లిపాడు గ్రామాల్లో రూ.20 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను మార్క్ఫెడ్ వైస్చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్తో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మరో రూ.30 కోట్ల నిధులు తెచ్చి నియోజకవర్గమంతా సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తామని అన్నారు.
ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు బీడీకే రత్నం, ముళ్లపాటి సీతారాములు, ధనేకుల వేణు, చల్లగుండ్ల నాగేశ్వరరావు, తడికమల్ల నాగేశ్వరరావు, ఉమ్మడి రామారావు, వేల్పుల పావని, నంబూరి కనకదుర్గ, లాల్మొహమ్మద్, అప్పం సురేశ్, కోసూరి శ్రీను, పోలా శ్రీను, పసంగులపాటి శ్రీను, కట్టా కృష్ణార్జునరావు, బాణాల వెంకటేశ్వరరావు, గుమ్మా రోశయ్య, పసుపులేటి మోహన్రావు, నామా రాజేశ్, పాసంగులపాటి ముత్తయ్య, షేక్ లాల్సాహేబ్, షేక్ తారాబీ, పాసంగులపాటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.