వైరాటౌన్, జూలై 16 : రైతుకు మూడు గంటల కరెంటు చాలు అన్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజలు ఎండగట్టాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. ఆదివారం వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన వైరా నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి విచిత్రమైన వ్యక్తి అని, ఎద్దు వ్యవసాయం తెలియని మూర్ఖుడని, ఎకరం పొలం దున్నడానికి మూడు గంటలు చాలు అని అనడం హాస్యస్పదమన్నారు. రేవంత్కు తెలిసింది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఓటుకు నోటు కేసులో నిలిచిన ఘనుడు అని, షటిల్మెంట్లు, రియల్ఎస్టేట్ దందా చేసి డబ్బులు దండుకోవడంలో పీహెచ్డీ చేశారని అన్నారు. కాంగ్రుస్ హయాంలో 24 గంటలు కరెంటు ఇచ్చినట్లు చెబుతున్న సీఎల్పీ నాయకుడు భట్టీవిక్రమార్క వైరా రింగు రోడ్డులో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
రైతుల బాధలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని, రైతు బాధలు తెలియని వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని యద్దేవా చేశారు. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్రెడ్డి ఒక్క ప్రాజెక్ట్నైనా తీసుకొచ్చాడా, తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక అవాక్కులు చెవాక్కులు పేలుతున్నాడని అన్నారు. పది రోజుల పాటు రైతువేదికల వద్ద జరుగు చర్చల్లో ప్రతి రైతుకు అవగాహన కల్పించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టాలని కోరారు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పధకాలను ప్రజలకు తీసుకెళ్లేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమం కోసం ప్రాజెక్టులు నిర్మించి ఉచిత విద్యుత్ను అందించే ఘనత కేసీఆర్దేనని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, నియోజకవర్గంలో వర్గాలకు అతీతంగా పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉచిత విద్యుత్ విషయంలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని, రైతు ఆత్మహత్యలు కూడా జరిగాయని, వాటిని రైతులు గుర్తించాలని కోరారు. లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం, దిండి ప్రాజెక్టులు రైతు సంక్షేమం కోసమే అని పేర్కొన్నారు. నేటి నుంచి జరిగే రైతు సమ్మేళనాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రైతు సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం డీసీసీబీ చైర్మన్ కూరాకుల
రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నా రు. ఇతర రాష్ర్టాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు, తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మధ్య తేడాను ప్రజలు గమనించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వర్లు, చిరంజీవి, బానోతు సురేశ్, పొ న్నేకంటి సతీశ్బాబు, పెద్దబోయిన ఉమాశంకర్, ఎంపీపీలు వేల్పుల పావని, మాలోతు శకుంతల, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, ఏఎంసీ చైర్మన్ బీడీకే రత్నం, పట్టణ అధ్యక్షుడు మద్దెల రవి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు లాల్మహ్మద్, సీనియర్ నాయకులు శెట్టిపల్లి వెంకటేశ్వర్లు, య ల్లంకి సత్యనారాయణ, పసుపులేటి మో హన్రావు,మచ్చా నర్సింహారావు, మచ్చా బుజ్జి, తోటకూర పిచ్చయ్య, ముత్యాల సత్యనారాయణ, లకావత్ గిరిబాబు, అజ్మీరా వీరన్న, రావూరి శ్రీను, పోట్ల శ్రీ ను, ఏలూరి శ్రీనివాసరావు, చౌడం నర్సింహారావు, మున్సిపాల్ కౌన్సిలర్లు వనమా విశ్వేశ్వరరావు, దారెల్లి కోటయ్య, తడికమళ్ళ నాగేశ్వరరావు, ఇమ్మడి రామారా వు, పట్టణ నాయకులు ఎ.శ్రీను, కె.హనుమంతరావు, ఎన్.మనోహర్, పి.సురేశ్, కోఆప్షన్ స భ్యులు బీబాసాహెబ్, బి.సక్కుబాయి, డి.శ్రీను పాల్గొన్నారు.