ఖమ్మం, జూన్ 7: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర మంగళవారం రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కృతజ్ఞాతపూర్వకంగా భేటీ అయ్యారు. తనను పెద్దల సభకు పంపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా తెలంగాణ వాణిని రాజ్యసభలో వినిపిస్తానని అన్నారు.
పార్టీ కోసం అహర్నిషలూ కృషి చేస్తానన్నారు. ఎంపీగా ఎన్నికైన రవిచంద్రను మంత్రి కేటీఆర్ శాలువాతో సత్కరించారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తలిపారు.