కారేపల్లి : విద్యారంగ ( Education sector ) సమస్యలపై యూటీఎఫ్ ( UTF ) నిరంతరం పోరాటాలు చేస్తుందని టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యగర్శి బానోత్ రాందాస్ ( Banoth Ramdas ) అన్నారు. గురువారం కారేపల్లి మండలం మాణిక్యారంలో జరిగిన యూటీఎఫ్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వరంగ విద్యతోనే సామాజిక అసమానతలు తొలగిపోతాయన్నారు. ప్రభుత్వ విద్య రక్షణకు ప్రజలు పోరాటాలకు సిద్దం కావాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పీఆర్సీ కమిటీ నివేదికను బహిరంగ పర్చి అమలుకు పూనుకోనాలని డిమాండ్ చేశారు. సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించాలన్న నిర్ణయం సహేతుకం కాదన్నారు.
ఈనెల 30వ తేదిన యూటీఎఫ్ జిల్లా కమిటీ విస్తృత స్ధాయి సమావేశాలు కల్లూరులో జరగనున్నాయనారు. వాటికి సంబంధించి వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గుత్తా ఫణికుమార్ , మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేవీ కృష్ణారావు, బానోత్ మంగీలాల్, ఉపాధ్యక్షులు బానోత్ సూర్య, ఆర్.నాగలక్ష్మి, కోశాధికారి ఎటుకూరి నాగేశ్వరరావు, ఎఫ్డబ్ల్యూఎఫ్ కన్వీనర్ మద్దినేని నాగేశ్వరరావు, కార్యదర్శులు సంతులాల్, ఈర్య, రామారావు, నరేంద్ర, భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు.