కొణిజర్ల, జనవరి 21: గిరిజనుల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యం కావాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ ధర్మానాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని లక్ష్మీపురంలో గిరిజన సంఘం తండా మహాసభలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులను కాలరాస్తూ పోడు భూములన్నింటినీ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నదని, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా అడ్డుపడుతుందని దుయ్యబట్టారు. కేంద్ర నిధులు గిరిజనుల అభివృద్ధికి ఖర్చు చేయకుండా పక్కదారి పట్టిస్తుందన్నారు.
అనంతరం 10 మందితో తండా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా బానోత్ రమేశ్, కార్యదర్శిగా బీ రాంచంద్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు తేజావత్ కృష్ణకాంత్, బానోత్ హరిచంద్, దరావత్ నంద్యానాయక్, ధారవత్ నర్సింహారావు, సాయి, మూడ్ ప్రవీణ్, బానోత్ శ్రీను, కృష్ణ, పవన్, శివలాల్ తదితరులు పాల్గొన్నారు.