భూపాలపల్లి రూరల్, ఫిబ్రవరి 13: విద్యుత్ డి మాండ్ పెరుగుతున్న నేపథ్యంలో థర్మల్ కేంద్రాలకు నిరాటంకంగా బొగ్గు సరఫరా చేయాలని జీ ఎం సీడీఎన్ కే సురేశ్ అన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్ నుంచి ఈడీ కోల్ మూమెంట్ జే అల్విన్తో కలిసి అన్ని ఏరియాల జీఎంలతో ఉత్ప త్తి ఉత్పాదకత, రవాణాపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 74 మిలియన్ ట న్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి రానున్న 47 రోజులు అతి కీలకమని పేర్కొన్నారు. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో ఉత్పత్తికి కొంత ఆటంకం కలిగినప్పటికీ, గత నెల నుంచి పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని తెలిపా రు.
ఈ నెలలో గత 12 రోజులుగా సగటున 2.14 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తూ, అంతే మొత్తం లో రవాణా కూడా చేయగలిగామని తెలిపారు. కాంట్రాక్టర్లు యంత్రాలతో ఓబీ వెలికితీసేలా జీ ఎంలు ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. భూ సేకరణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అడ్వైజర్ మైనింగ్ డీఎన్ ప్ర సాద్, భూపాలపల్లి జీఎం బళ్లారి శ్రీనివాస రావు, ఏజీఎం ఎన్ రామలింగం, ఓసీ-2 పీవో వెంకట రామారెడ్డి, ఏరియా అధికారి ప్రతినిధి అజ్మీరా తుకారాం, ఓసీ-3 పీవో రాజశేఖర్, ఎస్ఈ ఏ.వసంత్ పాల్గొన్నారు.