ఖమ్మం :తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్(టెస్కాబ్) పరిధిలోని డీసీసీబీ ఉద్యోగుల వేతన సవరణకు టెస్కాబ్ ఆమోదం తెలిపింది. గురువారం హైదరాబాద్లోని టెస్కాబ్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన వేతన సవరణకు సంబంధించిన పత్రాలపై తన ఆమోదం తెలుపుతూ సంతకం చేశారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవింద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయా జిల్లాల డీసీసీబీ చైర్మన్లతో పాటు టెస్కాబ్ ఎండీ నేతి మురళీధరర్రావు, బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు కనకం జనార్థన్, సురేందర్లు హాజరయ్యారు.