కొణిజర్ల, జనవరి14 : భారతావని దశ, దిశను మార్చేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని, బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఊరూరా, వాడా కదంతొక్కాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు లావుడ్యా రాములునాయక్, క్రాంతికుమార్ పిలుపునిచ్చారు. ఈ నెల 18న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ సన్నాహక సమావేశం బస్వాపురంలో శనివారం నిర్వహించారు. తొలుత స్థానిక పెద్దమ్మతల్లి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బహిరంగసభకు భారీగా జనం భారీగా తరలించాలని ఖమ్మం నగరాన్ని గులాబీమయం చేయాలని పేర్కొన్నారు. ఖమ్మంలో జరిగే సభ యావత్ దేశాన్ని ఆలోచింపజేయనున్నదని, దేశం అబ్బురపడేలా సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెకంటేశ్వరరావు, రాష్ట్ర విద్యా సంక్షేమ, మౌలిక వసతుల కల్పన అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీధర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వై.చిరంజీవి, జడ్పీటీసీ పోట్ల కవిత, నాయకులు పోట్ల శ్రీనివాసరావు, రైతుసమన్వయ సమితి మండల అధ్యక్షుడు మాధవరావు, సొసైటీ చైర్మన్ చెరుకుమల్లి రవి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు బోడా ప్రసాద్, పోగుల శ్రీను, పాసంగులపాటి శ్రీను, కేవీ, మండల మీడియా కోఆర్డినేటర్ భుక్యా నరసింహ, రాయల పుల్లయ్య, రామారావు, పొట్లపల్లి శేషగిరిరావు, వీరయ్య, రాయల నాగేశ్వరరావు, కే భిక్షం, నున్నా రామకృష్ణ, గుర్రం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
కారేపల్లి, జనవరి 14: ఖమ్మంలో ఈ నెల 18న జరగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు భారీగా జనాన్ని సమీకరించాలని ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని వైఎస్ఎన్ గార్డెన్లో శనివారం ఎమ్మెల్యే రాములునాయక్ అధ్యక్షతన ముఖ్యనాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ మొట్టమొదటి మహాసభ ఖమ్మం జిల్లాలో జరగడం మన అదృష్టమన్నారు. సభకు ప్రతి గ్రామం నుంచి ప్రజలు, కార్యకర్తలను తరలించాలన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా సభను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, రాష్ట్ర విద్యాసంస్థల మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ శ్రీధర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీపీ మాళోత్ శకుంతల పాల్గొన్నారు.