మామిళ్లగూడెం, జూన్ 7: పట్టణ ప్రగతిలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ప్రకాశ్నగర్లోని పోలీస్ కమిషనర్ ఆవరణలో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ పనులు, షటిల్, వాలీబాల్, టెన్నికాయిట్స్ కోర్టులను ప్రారంభించారు. అనంతరం ప్రాంగణంలో మొక్కలు నాటారు.
గత పట్టణ ప్రగతిలో నాటిన పండ్ల, కూరగాయల మొక్కలు నేడు ఫలాలు అందిస్తున్నాయని సీపీ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఖమ్మం పోలీస్ శాఖను అభినందించారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, అదనపు డీసీపీ అడ్మిన్ గౌస్ అలమ్, అదనపు డీసీపీ సుభాశ్చంద్రబోస్, ఏసీపీలు రామోజీ రమేశ్, ప్రసన్నకుమార్, వెంకటస్వామి, అర్బన్ తహసీల్దార్ శైలజ, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, కార్పొరేటర్ గజ్జల లక్ష్మి, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.