ఎర్రుపాలెం, ఫిబ్రవరి 12: కృష్ణా జలాలపై తెలంగాణ రాష్ర్టానికి ఉన్న హక్కులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నల్గొండలో మంగళవారం సాయంత్రం 3 గంటలకు నిర్వహిస్తున్న భారీ బహిరంగసభను జయప్రదం చేయాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు. సోమవారం ఎర్రుపాలెంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. తొలుత సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. సభలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని వివరించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శీలం కవిత, ఎంపీటీసీ మస్తాన్వలీ, ఏఎంసీ మాజీచైర్మన్ చావా రామకృష్ణ, నాయకులు బాబుషా, కొండేపాటి సాంబశివరావు, మదన్మోహన్రెడ్డి, గుర్రాల పుల్లారెడ్డి, రవి, శ్రీనివాసరెడ్డి, తిరుపతిరావు, కిశోర్బాబు, నరేందర్రెడ్డి, ప్రకాశ్, భాస్కర్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముదిగొండ, ఫిబ్రవరి 12: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని వెంకటాపురం గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం సభ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.