– అధ్యక్ష కార్యదర్శులుగా ఏలూరి, రాయల
ఖమ్మం రూరల్, ఆగస్టు 28 : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీ ఈ బ్లాక్(ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి) వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నిక శుక్రవారం జరిగింది. టీఎన్జీవోస్ కాలనీలో జరిగిన ఈ ఎన్నిక లో భాగంగా అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఏలూరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షురాలుగా పి.వెంకట నరసమ్మ, కార్యదర్శిగా రాయల మురళీకృష్ణ ప్రసాద్, జాయింట్ సెక్రటరీగా జి.మృదుల, కోశాధికారిగా రాసాల వెంకటేశ్వర్లు (వెంకట్), ఈసీ సభ్యులుగా కె.సత్యనారాయణ, పి.జ్వాలా నరసింహారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో ఏడుగురు ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎన్నికైనట్లు ఈ ఎన్నికల అధికారి పి.నాగచారి తెలిపారు. నూతనంగా ఎన్నికైన అసోసియేషన్ బాధ్యులు మాట్లాడుతూ టీఎన్జీవోస్ కాలనీ ఈ బ్లాక్ సర్వతోముఖాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఎన్జీవోస్ కాలనీ వాసులు పాల్గొన్నారు.