ఖమ్మం: ఖమ్మం జిల్లా టిఎన్జీఓస్ నూతన అధ్యక్ష,కార్యదర్శులుగా ఎన్నికైన షేక్ అప్జల్ హసన్, ఆర్వీఎస్ సాగర్లు ఇతర కార్యవర్గ సభ్యులతో కలిసి సోమవారం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్లు టిఎన్జీఓస్ అధ్యక్ష, కార్యదర్శులకు స్వీటు తినిపించి, శాలువాలతో సత్కరించారు.
కలెక్టర్ను కలిసిన వారిలో జిల్లా కోశాధికారి భాగం పవన్, అసోసియేట్ అధ్యక్షులు చుంచు వీర నారాయణ, ఉపాధ్య క్షులు నందగిరి శ్రీను, దాసరి రవికుమార్, తాడేపల్లి కిరణ్కుమార్, రెంటాల సమత, జాయింట్ సెక్రటరీలు చిట్టిప్రోలు రమణ,కట్టకూరు సైదులు, చింతకాయల కృష్ణ, వాసన్ రవికుమార్, తదితరులు ఉన్నారు.